బాలీవుడ్ లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ‘కొత్త బంగారు లోకం’ తో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ శ్వేతాబసు. తెలుగులో కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తర్వాత తెలుగులో ఈ అమ్మడి సినిమాలు తగ్గిపోయాయి..ఇదే సమయంలో వ్యభిచార కేసులో పోలీసులకు దొరికిపోయిన ఈ భామ కొంతకాలం సినిమాలకు దూరం అయ్యింది. ఆమెకు డబ్బు ఆశ చూపి బ్రోకర్లు పడుపు వృత్తిలోకి నెట్టివేసినట్లు అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.
మొత్తానికి వ్యభిచారం కేసు నుంచి బయట పడిన శ్వేతాబసు బాలీవుడ్ బుల్లితెరపై ఓ సీరియల్ లో నటించింది. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ అమ్మడికి సానుభూతి బాగానే లభించింది కానీ ఎవ్వరూ చాన్స్ ఇవ్వలేదు. తాజాగా ఈ అమ్మడు మిక్చర్ పొట్లం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతుంది.
ఈ చిత్రానికి సంబంధిచిన ఆడియో వేడుక హైదరాబాద్ లోని జే ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఆడియో వేడుకలో క్లీవేజ్ షోతో సందడి చేసింది. అలాగే పెద్ద ఎత్తున ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంది . ఎం వి సతీష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మిక్చర్ పొట్లం పై శ్వేతా బసు ప్రసాద్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.