మళియాల ఇండస్ట్రీలో పెను సంచలనాలు రేపిన సినీ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో కేరళ పోలీసులు ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ సహా ఇద్దరిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసు ఎన్నో రకాల మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో మరో కొత్త ట్విస్ చోటు చేసుకుంది. మరో వైపు పోలీసులు కాలమసేరీ మెడికల్ కాలేజీ వివరణాత్మక వైద్య నివేదికను ఇచ్చిందని, కాలమసేరి మెజిస్ట్రేట్ కోర్టుకు ఇన్ కెమెరా (రహస్య) నివేదికను సమర్పించామని చెప్పారు.
భావన దగ్గర మార్టిన్ను డ్రైవర్గా చేర్పించింది సునీలేనని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే ఇద్దరి మధ్య 40 సార్లు ఫోన్ సంభాషణలు జరిగాయని, అంతేగాకుండా ఆమె ఎక్కడకు వెళ్లేది, ఎప్పుడు వెళ్లేది మెసేజ్ల రూపంలోనూ చర్చించుకున్నారని తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే నటి భావనను కిడ్నాప్ చేసి ఆమెను కారులోనే లైంగికంగా వేదించి..ఫోటోలు, వీడియో తీసినట్లు తెలుస్తుంది.
అయితే దీని వెనుక ఈ నింధుతలతో పాటు ఎవరి హస్తం ఉన్నదన్న విషయంపై పోలీసులు పలు రకాలుగా ప్రశ్నిస్తున్నప్పటికీ.. ఈ కేసు విచారణకు సునీ సహకరించడం లేదని, పొంతన లేని విషయాలు చెబుతున్నాడని పోలీసులు కోర్టుకు విన్నవించారు.
తనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించవద్దని తాను సిద్ధంగాలేనని నిందితుడు సునీల్ కుమార్ కోర్టుకు చెప్పాడు. నిందితుడు సునీల్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కాగా ఈ కేసులో నిందితులుగావున్న విగీష్, సునీల్కు న్యాయస్థానం ఈ నెల 10 వరకు పోలీస్ కస్టడీని పొడిగించింది.