మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 'ఎవడు' మూవీ ఆడియో ఈ జూలై 1న విడుదల కాబోతుంది. ఈ ఆడియో ఫంక్షనుకి వచ్చే గెస్టుల విషయంలో మెగా అభిమానులకి ఇంతవరకు సరైన క్లారిటీ లేదు. కాసేపు చిరంజీవి అంటున్నారు, మరి కాసేపు పవన్ కళ్యాణ్ అంటున్నారు. వీరిద్దరూ కూడా వస్తారని మరో వైపు వినబడుతుంది. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నాడు.


అయితే ఈ ఆడియో ఫంక్షనుకి గెస్టుగా పవన్ కళ్యాణ్ వస్తున్నాడనేది దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. ఎందుకంటే పవన్ జూన్ 30 ఈవెనింగ్ హైదరాబాద్ చేరుకుంటాడు. సో, 1న జరిగే ఈ ఆడియోకి పవన్ ఇక్కడే ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా వస్తాడు. లేదంటే ఆ మధ్య రామ్ చరణ్ ఓ మూవీకి పవన్ ఇక్కడే ఉండి కూడా రాలేదని పెద్ద తతంగమే నడిపింది మీడియా. కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తాడనేది ఈ ఎవడు టీం కూడా గట్టిగా నమ్ముతుంది.


మరి చిరంజీవి సంగతి ఏంటి అంటే మాత్రం వచ్చేది రానిది 50-50 చాన్సులు మాత్రమే. ఒక వేళ చిరంజీవి సడన్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అంతే కాదు ఒక వేళ పని ఒత్తిడి వల్ల చిరు రాకపోయినా ఈ ఫంక్షన్లో చిరంజీవి వాయిస్ వినిపించేందుకు టీం ప్రయత్నాలు చేస్తోంది . ఫంక్షన్ టైంలో చిరంజీవి ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చిరుతో లైవులో మాట్లాడించేందుకు దిల్ రాజు ఏర్పాట్లు చేసినట్లుగా తాజా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: