జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణల మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తున్న నేపధ్యంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఒక భారీ మొత్తాన్ని తన బసవతారకం ట్రస్ట్ కు విరాళంగా తీసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. జూనియర్ బాలయ్యల మధ్య సాన్నిహిత్యం అంతంత మాత్రంగానే ఉన్నా బాలయ్య మాత్రం జూనియర్ తో సినిమా తీసిన నిర్మాతల సహాయం అంగీకరించడం ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

జూనియర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ తారక్ కెరియర్ కు ఒక మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో  ఎన్టీఆర్ వాడిన రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈమూవీలో చాల సన్నివేశాలలో జూనియర్ బైక్ పై కనిపించి తన అభిమానులకు జోష్ ను ఇచ్చాడు. 

ఈమూవీతో జూనియర్ తో పాటుగా ఈసినిమాలోని బైక్ కు కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో జూనియర్ వాడిన ఈ బైక్ ను సొంతం చేసుకునే విషయంలో జూనియర్ అభిమానుల మధ్య పోటీ పెడితే ఒక వీరాభిమాని ఈ బైక్ ను 10 లక్షలకు సొంతం చేసుకున్నాడు. 

ఇప్పుడు ఈమోత్తాన్ని ‘జనతా గ్యారేజ్’ నిర్మాతలు దర్శకుడు కొరటాల శివతో కలిసి నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న  బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళంగా అందజేశారు. స్వయంగా బాలయ్య ఇంటికి వెళ్ళి ఈసినిమా నిర్మాతలు బాలకృష్ణకు ఈ చెక్కును అందివ్వడం జరిగింది.  

గత కొంత కాలంగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞను కొరటాల శివ డైరెక్షన్ లో అతడి తొలి సినిమాను నటింప చేయాలి అన్న ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘జనతా గ్యారేజ్’ నిర్మాతలు అయిన మైత్రీ మూవీస్ అధినేతలు ఇలా బాలయ్యను కలవడం బట్టి మోక్షజ్ఞ సినిమాకు మైత్రీ మూవీస్ నిర్మాతలు నిర్మించినా ఆశ్చర్యం లేదేమో అని అనిపిస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: