తెలుగు రాష్ట్రాలకు బాగా దూరంలో ఉన్న కేరళ రాష్ట్రంలో అల్లు అర్జున్ అభిమానులు అల్లు శిరీష్ సినిమా కోసం చేస్తున్న హడావిడి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అభిమానులకు విపరీతమైన కోపాన్ని తెప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలు తరువాత అల్లు అర్జున్ కు కేరళా రాష్ట్ర యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. 

‘మల్లు’ అర్జున్ అంటూ బన్నీని మలయాళ యూత్ బాగా అభిమానిస్తారు. దీనితో బన్నీ సినిమాలకు కేరళలో కూడ మంచి మార్కెట్ ఉంది. తన అన్న అల్లు అర్జున్ ను అనుసరిస్తూ కేరళాలో అల్లు శిరీష్ మల్లు శిరీష్ గా మారడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. 

దీనిలో భాగంగా అల్లు శిరీష్ '1971 బియాండ్‌ బోర్డర్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా పబ్లిసిటీ కోసం కేరళ రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో అల్లు శిరీష్ ను హైలెట్ చేస్తూ పెట్టిన హోర్డింగ్స్ ముందు సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ఫొటోలు చిన్నబోవడం ఇప్పుడు మోహన్ లాల్ అభిమానులకు కోపాన్ని తెప్పించడమే కాకుండా శిరీష్ అత్యుత్సాహానికి ఆశ్చర్యపోయేలా చేస్తోంది. 

అల్లు శిరీష్ నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' హిట్ అయినా ఇంకా అతడికి పాపులర్ యంగ్ హీరోగా ఇమేజ్ రాలేదు. అయితే ఆ విషయాలను పట్టించుకోకుండా శిరీష్ మోహన్ లాల్ తో కలిసి నటిస్తున్న '1971 బియాండ్‌ బోర్డర్‌' మూవీ కోసం ఏకంగా మోహన్ లాల్ ను పక్కకు పెడుతూ తనకు తన అన్న బన్నీకి భారీ పబ్లిసిటీ వచ్చే విధంగా ఇలాంటి హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసం అన్న కామెంట్స్ మలయాళ మీడియా ఈ అల్లు బ్రదర్స్ పై వ్రాస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: