ఈ మద్య వెండితెరపై హీరోయిన్ల కన్నా బుల్లితెరపై కనిపిస్తున్న యాంకర్లకు మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు.   ఇక తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ.  ప్రోగ్రామ్ మొదలైన కొద్ది రోజుల్లోనే ఈ అమ్మడి డ్రెస్సింగ్, హాట్ లుక్స్, కవ్వించే మాటలకు కుర్రకారు ఫిదా అయ్యారు.  దీంతో బుల్లితెరపైనే కాకుండా వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అనసూయ.  ఇక అనసూయ జబర్ధస్ ప్రోగ్రామ్ నుంచి బయటకు రాగానే ఆమె ప్లేస్ లో రష్మీ ఎంట్రీ ఇచ్చింది.  

ఈ అమ్మడు అనసూయ మించిపోయింది..హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రకారు మతులు పోగొట్టింది.  దీంతో రష్మికి కూడా మంచి క్రేజ్ రావడంతో ఏకంగా వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  గుంటూర్ టాకీస్ సినిమలో విపరీతంగా రెచ్చిపోయిన ఈ అమ్మడు సక్సెస్ మాత్రం అందుకోలేక పోయింది. తర్వాత వచ్చిన సినిమాలు కూడా పెద్దగా విజయాలు సొంతం చేసుకోలేదు. దీంతో మళ్లీ యంకరింగ్ వైపు మొగ్గుచూపింది.  ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్ధస్త్ లో యాంకర్ గా చేస్తున్న రష్మీ తాజాగా హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది.  
Image result for tollywood actress bikini pics
సినిమాల్లో హీరోయిన్లు బికినీలు వేసుకొని, షార్ట్స్ వేసుకొని, శృంగార పాత్రల్లో నటిస్తుంటే వారిపై ఎలాంటి కామెంట్ చేయరు కానీ..మేం మాత్రం బుల్లి తెరపై ఈ మాత్రం కనిపించినా విమర్శలు చేస్తున్నారని మండిపడింది.  వెండితెరపై హీరోయిన్లంతా చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారని చెప్పింది. తాము ఈ మాత్రం ట్రెండీగా కనిపించడంలో తప్పులేదని తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: