ప్రముఖ దర్శకుడు మణిరత్నం తనకు అన్యాయం చేసాడు అంటూ ఆయన ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసే లైట్ మ్యాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. తనకు మణిరత్నం సాయం చేయకపోతే ఆయన ఇంటిముందే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ మణిరత్నం యూనిట్ లో లైట్ మ్యాన్ గా పనిచేసిన మణిమారన్ మణిరత్నంను టార్గెట్ చేస్తూ ప్రకటనలు ఇస్తున్నట్లు కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. 

మణిరత్నం గతంలో అభిషేక్ బచ్చన్ఐశ్వర్యలతో కలిసి ‘గురు’ అనే మూవీని చేయడం జరిగింది. ఈ సినిమా అప్పట్లో ఒక భయంకరమైన ఫ్లాప్. ఈసినిమా షూటింగ్ సమయంలో లైట్ మ్యాన్ మణిమారన్ కు  రక్తసంబంధిత వ్యాధి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతడి వైద్య ఖర్చులకోసం సినిమా యూనిట్ ఎలాంటి సాయం చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనితో మణిమారన్ కోర్టుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. కోర్ట్ లో ఇతడికి అనుకూలంగా తీర్పు రావడమే కాకుండా అతడికి నష్ట పరిహారంగా 2 లక్షలు ఇమ్మని కోర్ట్ ఆదేశించినట్లు కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. అయితే ఇప్పుడు ఆ తీర్పును మణిరత్నం పట్టించుకోవడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి.

తన వైద్య ఖర్చులు గత పదేళ్ల నుంచి తన కుటుంబ సభ్యులే భరిస్తున్నారని ఇప్పటికైనా తనకు మణిరత్నం న్యాయం చేయని పరిస్థుతులలో తాను మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని మణిరత్నంను టార్గెట్ చేస్తూ మణిమారన్ కోలీవుడ్ మీడియాకు ప్రకటనలు ఇస్తున్నాడు. దీనితో ఎన్నో గొప్ప సినిమాలు తీసిన మణిరత్నంకు సినిమా రంగంలోని ఒక చిన్న వ్యక్తి కష్టాలు తెలియవా అంటూ కోలీవుడ్ మీడియా ఘాటైన కామెంట్స్ వ్రాస్తోంది. 

ప్రస్తుతం ఈ న్యూస్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడంతో మణిరత్నం ఈవిషయం పై ఎందుకు స్పందించడు అంటూ కోలీవుడ్ మీడియా మణిరత్నం పై సెటైర్లు వేస్తోంది. ఈమధ్య కాలంలో రకరకాల షాక్ లను అందుకుంటున్న మణిరత్నంకు మణిమారన్ విషయం లేటెస్ట్ షాక్ అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: