అనేక ఆలోచనల తరువాత ఎన్నో కధలు విన్న తరువాత విక్రమ్  కుమార్ దర్శకత్వంలో మొదలు అయిన అఖిల్ రెండో సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈనెల ప్రారంభంలో మొదలు అయిన ఈ మూవి షూటింగ్ కు సంబంధించి ఇప్పుడు ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను పిక్చరైజ్ చేస్తున్నాడు. 

ఈ మూవీకి ‘జున్ను’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారనే వార్తలు ఇప్పటికే ఉన్నాయి. ప్రారంభంలోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న అఖిల్ రెండవ సినిమా వివరాలలోకి వెళితే ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైద్రాబాద్ మెట్రో రైల్ లోజరుగుతోంది. దీనితో ఇంకా ప్రారంభం కాని హైదరాబాద్ మెట్రో రైల్ లో  షూటింగ్ జరుపుకున్న తొలిచిత్రంగా అఖిల్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది అంటూ ఈ సినిమా యూనిట్ సంబరాలు జరుపుకుంటోంది.

ఇంతవరకూ హైద్రాబాద్ మెట్రో కార్యకలాపాలు ప్రారంభం కాలేదు కానీ ఇప్పటికే ట్రయల్ రన్స్ జరుతున్న విషయం తెలిసిందే. అఖిల్ రెండో సినిమాను యాక్షన్ జోనర్ తో పాటు ఇప్పటివరకూ టాలీవుడ్ లో ఎవరూ టచ్ చేయని ఓ కొత్త జోనర్ ను కూడా మిక్స్ చేసి చూపించాలీ అన్న తపనతో  దర్శకుడు విక్రమ్ కె కుమార్. విభిన్నమైన కథతో ఈ సినిమాను తీస్తున్న విషయం తెలిసిందే. 

‘మనం’ లాంటి బ్లాక్  బస్టర్ ఇచ్చిన దర్శకుడు కావడంతో నాగార్జున ఈ సినిమా విషయంలో విక్రమ్ కుమార్ కు బడ్జెట్ పరిమితులు ఇవ్వకుండా ఈ సినిమాను రిచ్ గా తీయమని చెప్పినట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. అఖిల్ డెబ్యూ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో నాగార్జున ఈ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకోసం మరో సెంటి మెంట్ ను పాటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విక్రమ్ కుమార్ గతంలో తెలుగులో తీసిన ఫస్ట్ హిట్ మూవీ 'ఇ ష్క్' లో అజయ్ విలన్ గా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత సూర్యతో విక్రమ్ తీసిన ‘24’ మూవీలో కూడా అదే సెంటిమెంట్ గా అజయ్ ని‌ కంటిన్యూ చేసాడు. ఆ మూవీ సక్సెస్ కావడంతో ఇప్పుడు అఖిల్ తో చేస్తున్న మూవీలో కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతూ అజయ్ నే విలన్ గా తీసుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: