ఎన్టీఆర్ కెరీర్‌ లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో భారీ అంచనాలతో నిర్మిస్తున్న ‘జై లవ కుశ’ షూటింగ్ అత్యంత వేగవంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. జూనియర్ కెరియర్ లో మొట్టమొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ఈసినిమాకు సంబంధించి ఒకొక్క షాకింగ్ న్యూస్ నెమ్మదిగా బయట పడుతున్నాయి. 

జూనియర్ నటించే మూడు పాత్రలలో ఒక పాత్రకు విలన్ ఛాయలు ఉన్న నేపధ్యంలో సినిమాలో జూనియర్ లుక్ ను డిఫరెంట్ గా చూపెట్టడానికి హాలీవుడ్ నుంచి నిపుణులను రప్పించి ప్రత్యేకమైన మేకప్ ను జూనియర్ కు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈసినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్స్ గా ఎంపిక అయిన నేపధ్యంలో వీరిమధ్య ఎవరూ ఊహించని విధంగా యంగ్ హీరోయిన్ నందితా రాజ్ ను ఒక కీలక పాత్రకు ఎంపిక చేయడం ఆమె అప్పుడే ఈమూవీ షూటింగ్ స్పాట్ లోకి జాయిన్ కావడం కూడ జరిగిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి.

‘ప్రేమకథా’ చిత్రం తరువాత నందితా రాజ్ కు వచ్చిన క్రేజ్ ను చూసి ఆమె టాప్ హీరోయిన్ అయిపోతుంది అని అనుకున్నారు అంతా. అయితే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ ‘శంకరాభరణం’  ‘సావిత్రి’ లాంటి వరస ఫ్లాప్ సినిమాలలో నటించిన నందిత తన క్రేజ్ ను పోగొట్టుకుంది. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమెకు జూనియర్ సినిమాలో అవకాశం రావడం బంపర్ ఆఫర్ అనుకోవాలి. ఈ సినిమా పై భారీ క్రేజ్ ఉన్న నేపధ్యంలో నందితకు ఈసినిమా విడుదల తరువాత   ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: