కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టింది రూల‌ర్ టీమ్. నాలుగు నెల‌లుగా క‌థానాయిక కోసం అన్వేషించి, చివ‌రికి సోనాల్ చౌహాన్ అనే  ఓ ఫ్లాప్ హీరోయిన్‌ని వెదికి ప‌ట్టుకొచ్చారు. రెయిన్‌బో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మాయి. ఆ సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా తెలీదు. పైగా సోనాల్ మోము కూడా రిజిస్ట‌ర్ కాలేదు.

ద‌క్షిణాదిన ఇంత మంది హీరోయిన్లు ఉండ‌గా, సోనాల్‌నే ఎందుకు తీసుకొన్నారు అనేది ఇప్ప‌టికీ అర్థం కాని ప్రశ్న‌. టాప్ క‌థానాయిక‌లు బాల‌య్య తో న‌టించ‌డానికి సిద్ధంగా లేర‌ని అందుకే ఊరూ పేరు లేని క‌థానాయిక‌ను తీసుకురావ‌ల్సివ‌చ్చింద‌ని నాన్ బాల‌య్య ఫ్యాన్స్  చెబుతున్నారు. శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌లో కూడా సెకండ్ గ్రేడ్ హీరోయిన్ల‌తో స‌రిపెట్టుకోవ‌ల‌సి వ‌చ్చింది.

��

ఈ సినిమాలో మ‌రో నాయిక‌కు ఛాన్స్ ఉంది. అందులో అయినా కాస్త క్రేజ్ ఉన్న క‌థానాయిక‌ను తీసుకొంటే బాగుంటుంద‌ని నంద‌మూరి ఫ్యాన్స్ కోరుకొంటున్నారు. మ‌రి చిత్ర బృందం ఎవ‌రిని ఎంచుకొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: