పోకిరి సినిమాతో మ‌హేష్ బాబు రేంజ్ బాలీవుడ్‌కి తెలిసింది. ఆ సినిమా వాంటెడ్‌గా బాలీవుడ్ బాక్సాఫీసుని ద‌ద్ద‌రిల్లేలా చేసింది. ఇప్పుడు బాలీవుడ్ మ‌హేష్ సినిమాల‌పై దృష్టి పెట్టింది. మ‌హేష్ న‌టించిన మ‌రిన్ని సినిమాల్ని హిందీలోకి రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. బిజినెస్‌మేన్ సినిమా హిందీలో తీస్తున్నారు. ఇప్పుడు.. ఒక్క‌డు కూడా ఆ జాబితాలో చేరింది.

మ‌హేష్ - గుణ‌శేఖర్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఒక్క‌డు ఎంత సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఇన్నాళ్ల‌కు ఈ సినిమా బాలీవుడ్ వెళ్తోంది. అమిత్ శ‌ర్మ ఈ చిత్రానికి దర్శ‌కుడు. అర్జున్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తారు. భూమిక పాత్ర‌లో సోనాక్షి సిన్హా క‌నిపించ‌నుంది. సంజ‌య్ క‌పూర్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.

ఈ సినిమా బాలీవుడ్ రైట్స్‌ని భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకొన్నారు సంజ‌య్‌. ఈ సినిమాకి క‌నీ వినీ ఎరుగ‌ని రేటు ప‌లికింద‌ట‌. ఒక్క‌డు సినిమా ఇప్ప‌టికీ ఎమ్మెస్ రాజుకి కాసులు కురిపిస్తోంద‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: