కాజల్ పని అయిపోయింది అని కామెంట్స్ చేసిన చాలామందికి సమాధానం ఇచ్చే విధంగా తిరిగి కాజల్ కు ఏర్పడిన క్రేజ్ చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం ఆమె రానా తో కలిసి నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు విడుదల కాకుండానే ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ ఏర్పడటంతో ఆమెతో సినిమాలు చేయడానికి ఇంకా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా ఈసినిమాలో కాజల్ చాల నిండుగా అందమైన చీరలతో పాటు నిండైన నగలతో కనిపిస్తోంది. అయితే ఈ నగలు అన్నీ కూడ ప్యూర్ గోల్డ్ నగలు అని అంటున్నారు. ఈ నగలు అన్నింటిని హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ జ్యూయలరీ సంస్థ స్పాన్సర్ చేసిందట.

ఈ మూవీలో కాజల్ రకరకాల సీన్స్ కోసం మార్చుకున్న నగలు విలువ కోట్ల రూపాయలలో ఉంటుందని టాక్. అందువల్ల ఈసినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఈ నగల సెక్యూరిటీ కోసం ఆ జ్యూయలరీ సంస్థ కాజల్ వద్ద హై సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు టాక్. 

ప్రతిరోజు షూటింగ్ టైం కు ఆనగలు తీసుకు రావడం షూటింగ్ పూర్తి అయిన తరువాత ఆ నగలను తిరిగి తీసుకు వెళ్ళడానికి తమ సిబ్బందిని ప్రత్యేకంగా ఈ పని నిమిత్తమే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే కేవలం నగలు ఇవ్వడమే కాకుండా ఈసినిమా టైటిల్స్ లో తమ నగల షో రూమ్ పేరు చూపించడానికి ఆ జ్యూయలరీ సంస్థ ‘నేనే రాజు నేనే మంత్రి’ నిర్మాతలకు కోటిన్నర వరకు ప్రచార ఖర్చులు నిమిత్తం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ప్రస్తుతం ఈసినిమాకు వస్తున్న క్రేజ్ అంతా రానా చలువ వల్ల అన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘బాహుబలి 2’ విడుదల తరువాత వస్తున్న మొట్టమొదటి రానా సినిమా కావడంతో ఈసినిమాకు ఏర్పడిన క్రేజ్ ఈసినిమా నిర్మాతలకే కాకుండా కాజల్ కు కూడ అదృష్టంగా మారింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: