స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ బ్యూటీ పూజా హెగ్దె హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా దువ్వాడ జగన్నాధం. సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదిరిపోయిన ఈ ఇద్దరి మధ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్లోజ్ నెస్ బాగా పెరిగిందట. ఇక ఇదే ఊపు మీద బన్ని అండ్ కో ఫారిన్ ట్రిప్ కూడా వేశారు. ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ జరిగిందట.


ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉండటమే కాదు ఓ నైట్ మొత్తం చిత్రయూనిట్ కు చెప్పాపెట్టకుండా బన్ని, పూజా ఎటో చెక్కేశారట. తెల్లారి కాని వారు మళ్లీ దర్శక నిర్మాతలతో జాయిన్ అవ్వలేదట. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. తన సహనటులందరితో బన్ని క్లోజ్ గానే ఉంటాడు. అయితే పూజా విషయంలో మాత్రం ఆ క్లోజ్ నెస్ బాగా ఎక్కువయ్యిందని అంటున్నారు. 


తెలుగులో ఎలాగైనా సరే క్రేజ్ తెచ్చుకోవాలనుకునే క్రమంలో స్టైలిష్ స్టార్ ను వల్లో వేసుకుందన్న టాక్ వస్తుంది. బన్ని, పూజా ఆరోజు నైట్ అంతా విహార యాత్రకు వెళ్లారా లేక ఏం చేశారు అన్నది ఎవరికి తెలియని విషయం. టాలీవుడ్ లో సరికొత్త గాసిప్పులు క్రియేట్ చేస్తున్న ఈ మ్యాటర్ పై అసలు సినిమా ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.


ఇక డిజె సక్సెస్ తో పూజా డిమాండ్ ఓ రేంజ్ లో పెరిగింది. అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తున్న సినిమాకు ఏకంగా కోటిన్నార దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందట. డిజెలో బికినితో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన పూజా రాబోయే సినిమాలో కూడా ఏమాత్రం తగ్గకుండా ఉండేలా గ్లామర్ షోకు అడ్డు చెప్పడం లేదని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: