తెలుగు ఇండస్ట్రీలో విశ్వనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇండస్ట్రీకి చెందిన తన సహనటి సారికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి శృతిహాసన్, అక్షర హాసన్ అనే కూతుళ్లు పుట్టారు. కొంత కాలం తర్వాత సారికతో విడిపోయిన కమల్ హాసన్ నటి గౌతమితో సహజీవనం కొనసాగించారు. ప్రస్తుతం వీరు కూడా విడిపోయినట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. ఇక ఇండస్ట్రీలోకి కమల్ హీసన్ ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు.
ఇప్పటికే శృతిహాసన్ తమిళ,హిందీ,తెలుగు భాషల్లో బిజీనటిగా కొనసాగుతున్నారు. శృతిహాసన్ మొదటి నుంచి కాస్త దూకుడు స్వభావం కలిగిన వ్యక్తిగా..ఏదైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాతుంది. వివాహం విషయంలో కూడా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఇక ప్రేమ విషయానికి వస్తే..తాను ఇప్పటి వరకు ఎంతో మందిని ప్రేమించానని అందులో ఎవరూ తనకు నచ్చలేదని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మైఖేల్ కొర్సలే కుర్రాడి ప్రేమలో మునిగిపోయిందని వార్తలు వస్తున్నాయి.
తాజాగా తిగ్ మన్షు దులియా దర్శకత్వంలో కునాల్ కపూర్, మోహిత్ మర్వా, మృదుల, అమిత్ సద్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం రాగ్ దేష్ . ఈ రోజు గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా స్పెషల్ స్క్రీనింగ్ జరుపుకుంది. ఈ షోకి తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కొర్సలే తో కలిసి వచ్చిన శృతి హాసన్ మీడియాకు స్పెషల్ ఎంట్రాక్షన్ అయ్యింది. దీంతో అందరూ ఈ జంటపైనే ఫోకస్ పెట్టారు. లండన్ లో ఉంటున్న ఇటాలియన్ బాయ్ మైఖేల్ కొర్సలే బుధవారం రాత్రి ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగగా , అతడిని రిసీవ్ చేసుకోవడానికి శృతి ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.
మేఖేల్ కారులోకి ఎక్కగానే ఎగ్జైట్ మెంట్ తో అతడిని గట్టిగా హగ్ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. ఈ స్క్రీనింగ్ కి రణదీప్ హుడా, హృతిక్ రోషన్, కిరణ్ రాం , సౌరభ్ మిశ్రా తో పాటు దిగ్విజయ్ సింగ్ ఆయన భార్యతో కలిసి ఈ షోకి వచ్చారు.