చూడటానికి బక్కగా బాగా నల్లగా కనిపించే ధనుష్ వెండితెర పై కనిపిస్తే మాత్రం తమిళ ప్రేక్షకులు ఈలలతో హడావిడి చేయడమే కాకుండా ఈహీరో చెప్పే డైలాగ్స్ కు చప్పట్లతో ధియేటర్లు హోరెత్తిపోతాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడ తన ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ యంగ్ హీరో నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజినీకాంత్ బ్యాక్ గ్రౌండ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

తాను రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యను పెళ్ళి చేసుకున్న తరువాత తనకు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి అన్న విషయాన్ని బయట పెట్టాడు ధనుష్. తాను ఎక్కడకు వెళ్ళినా తనను రజినీకాంత్ అల్లుడుగా గుర్తిస్తున్న నేపధ్యంలో తనకంటూ ఒక గుర్తింపు రాదా ? అంటూ తాను చాల మానసిక వ్యథను అనుభవించిన విషయాన్ని బయట పెట్టాడు. 

అంతేకాదు ఆ మానసిక వ్యథ వల్ల మాత్రమే నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేల చేసింది అంటూ రజినీకాంత్ ఇమేజ్ ముందు తనంతట తానుగా ఎదగడానికి చాల మానసిక ఘర్షణ పడ్డ విషయాలను బయట పెట్టాడు ధనుష్. ఇక తన తండ్రి కస్తూరి రాజా తనను చిన్నప్పుడు అనేక సార్లు కొట్టిన సందర్భాలను గుర్తుకు చేసుకుంటూ తనకు నటన అంటే ఇష్టం లేకపోయినా బలవంత పెట్టి తనను హీరోగా మార్చిన తన తండ్రితో అదేవిధంగా తన అన్న సెల్వరాఘవన్ తో అనేక సార్లు గొడవ పడిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు ధనుష్. అయితే తనలా సన్నగా నల్లగా ఉండే వ్యక్తులను కూడ హీరోగా ఆదరిస్తారని తాను సినిమాలలో నటించడం మొదలుపెట్టాక తెలిసింది అని అన్నాడు ధనుష్.

తనకు 11 సంవత్సరాల కొడుకు ఉన్నాడని చాలామందికి తెలియదు అని అంటూ ఎప్పటికైనా రజినీకాంత్ ను డైరెక్ట్ చేయాలని తన కోరిక అని అంటూ తాను ఈరోజు ఇంత సంపాదించినా తన చిన్నతనంలో తన కుటుంబ సభ్యులు అంతా ఒకే బెడ్ రూమ్ లో తింటూ ఒకే బెడ్ రూమ్ లో పడుకున్న రోజులే తనకు ఆనందాన్ని కలిగించిన రోజులు అని చెపుతూ తనలోని వేదాంత కోణాన్ని బయట పెట్టాడుధనుష్. త్వరలో దాదాపు 14 వందల ధియేటర్లలో మూడు భాషలలో విడుదల కాబోతున్న ‘విఐపి 2’ విజయం పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు ఈ కోలీవుడ్ హీరో..    



మరింత సమాచారం తెలుసుకోండి: