తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ. ఇప్పటి వవరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు బాలయ్య.  గత కొంత కాలంగా ఫ్యాక్షన్ తరహా పాత్రలు పోషిస్తున్న బాలయ్య ఈ సంవత్సరం క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రంతో తన వంద చిత్రాలు పూర్తి చేసుకున్నారు.  ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధి ఫస్ట్ లుక్, టీజర్ సోషల్ మీడియాలో దుమ్ముదులిపాయి.

 ప్రస్తుతం బాలయ్య తన 102 వ చిత్రం రామోజీ ఫిలిం సిటిలో  ప‌లువురు ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో పూజా కార్యక్ర‌మాలు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. చిత్ర పూజా కార్య‌క్ర‌మంలో భాగంగా ఈవెంట్ కి వ‌చ్చిన సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రుగా దేవుని చిత్ర‌ ప‌టాల‌కు కొబ్బరి కాయ‌లు కొట్టారు.  సాధారణంగా రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా బాలకృష్ణ కోపం వస్తే ఎలాంటి వారైనా సరే తిట్టడమో..చేయి చేసుకోవడమో చేస్తుంటారు.  

ఆ మద్య తన అభిమాని కాని వ్యక్తి వచ్చి ఫోటో తీసుకోబోతుంటే పక్కకు నెట్టేసి వార్నింగ్ ఇచ్చిన విషయం మరువక ముందే..మరోసారి తన అసిస్టెంట్ చెంప చెల్లు మనిపించి మరోసారి సోషల్ మీడియా వార్తల్లోకి ఎక్కారు బాలకృష్ణ. నంద‌మూరి బాల‌కృష్ణ 102వ చిత్రం రామోజి ఫిలిమ్ సిటిలో పూజా కార్యక్రమంలో పాల్గొనబోయే ముందు బాలకృష్ణ దేవుని ప‌టాల ద‌గ్గ‌ర కొబ్బ‌రి కాయ కొట్ట‌డానికి వెళ్ళే ముందు త‌న అసిస్టెంట్ త‌లపై మొట్టి షూస్ తీయ‌మ‌ని అన్నాడు.
Image result for balakrishna beats assistant
ఆయ‌న చేసిన ఈ చిలిపి ప‌నిని కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార్చారు.  అయితే అది బాలయ్య చిలిపిగా చేశారో..లేదా సీరియస్ గా చేశారో తెలియదు కాని..నిన్నటి నుంచి  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.  ఎస్ ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న బాల‌య్య 102వ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నారు. న‌య‌న‌తార ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: