బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ హీరోగా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ దంపతులు ఇప్పుడు అపాయంలో ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ న్యూస్ మీడియా. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అమీర్ఖాన్, ఆయన సతీమణి కిరణ్రావులు స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించాడు. ఒకరి ద్వారా మరొకరికి అంటే వైరస్ కావడంతో.... వారు ఇంటి నుండి బయటికు వెళ్లడం లేదు, ఆదివారం పుణెలో పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సత్యమేవ జయతే వాటర్ కప్-2017' ఈవెంటుకు కూడా వారు దూరంగా ఉన్నారు.
స్వైన్ ఫ్లూ కి సంబంధించి చికిత్స కూడా వారి ఇంట్లోనే తీసుకుంటున్నారట. అయితే ఇప్పటి వరకు అది సీక్రెట్ గా మెయింటేన్ చేస్తూ ఇప్పుడు ఈ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించాడు. ఆదివారం పుణెలో పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యమేవ జయతే వాటర్ కప్ అవార్డ్స్ ఫంక్షన్కు ఈ కారణంగానే హాజరుకాలేకపోయానని వివరణ ఇచ్చాడు.
అయితే ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోయినప్పటికీ తన స్నేహితుడు షారూక్ను పంపించాడు. పుణెలో పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సత్యమేవ జయతే వాటర్ కప్-2017' ఈవెంటుకు ఈ ఈవెంట్ కు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, నీతా అంబానీ, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హాజరయ్యారు.
#WATCH Pune: Aamir Khan says "have contracted Swine Flu and are skipping the event so that others do not contract the same". pic.twitter.com/xIa4keG2Mz
— ANI (@ANI_news) August 6, 2017