మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో..స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్.  గత సంవత్సరం ‘సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సంవత్సరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో నటించాడు.  ఈ చిత్రంపై మొదటి నుంచి ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి..అంతే కాదు కలెక్షన్లపై కూడా ఎన్నో రూమర్లు వచ్చాయి.  ఏది ఏమైనా సినిమా మాత్రం మంచి విజయం సాధించింది.  
Image result for duvvada jagannadham
తాజాగా అల్లు అర్జున్, వక్కంతం వంశి కాంబినేషన్ లో వస్తున్న  'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  అయితే ఇప్పటి వరకు ఫస్ట్ షెడ్యూల్ అయ్యింది..కాకపోతే అల్లు అర్జున్ మాత్రం ఈ షూటింగ్ లో పాల్గొనలేదు.  ఇప్పుడు రెండవ షెడ్యూల్ ను ఈ నెల 18వ తేదీ నుంచి మొదలెట్టనున్నారు. ఆ రోజు నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకూ కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అయితే ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ పాల్గొనబోతున్నాడట..అంతే కాదు ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో ఒకప్పటి యాక్షన్ హీరో అర్జున్ నటించడం మరో విశేషం.  
Image result for naa peru surya naa illu india
అర్జున్ ఇప్పటికే ‘లై’ చిత్రంలో విలన్ గా నటించారు.  మరో ముఖ్యపాత్రలో శరత్ కూమార్ నటిస్తున్నారట.  హీరోయిన్ గా అందాల బొమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది.   విశాల్ - శేఖర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: