అల్లరి న‌రేష్‌,క‌ళ్యాణ్‌రామ్ ఇద్దరి మూవీలు కెవ్వుకేక‌,ఓం ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. రెండు మూవీలు హిట్టో ప‌ట్టో ప‌క్కన‌పెడితే ఎల‌క్ట్రానిక్ మీడియాలో మాత్రం తెగ ప్రమోష‌న్ జ‌రిపించారు. ముఖ్యంగా ఓం త్రిడి మూవీకు క‌ళ్యాణ్‌రామ్ ఎంత క‌ష్టప‌డ్డాడో, ఆ మూవీ ప్రమోష‌న్‌కు అంతే క‌ష్టప‌డ్డాడు. 

అన్ని ఛానల్స్‌కు ఈ రెండు మూవీలు బాగానే బిజినెస్ ఇవ్వడంతో ఆ మూవీల రిజ‌ల్ట్ నెగిటివ్ వ‌చ్చినా ఛానల్స్ ఎక్కడా నోరు ఎత్తలేదు. ఒక క‌మ్యూనిష్ట్ మీడియా మాత్రం ఏకంకా రిపోర్ట్‌ను త‌యూరుచేసి నేడేచూడండి అంటూ ఓం,కెవ్వుకేక మూవీల‌ను ఏకిపారేశాయి.

దీంతో  రెండు రోజుల బ్లాక్‌మెయిలింగ్‌ త‌రువాత ఆ మూవీల ప్రమోష‌న్‌ను నేడే చూడండి అంటూ మ‌ళ్ళీ ఊద‌గొట్టింది ఆ మీడియ‌. దీంతో ఆ ఛాన‌ల్ దెబ్బకు నంద‌మూరి హీరో, అల్లరోడు ఇద్దరూ భ‌య‌ప‌డ్డారా అనే సందేహం క‌లిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: