టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఫాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు స్టార్ డం ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ కెరియర్ మొదట్లో ఓ రెండు సినిమాల్లో ఓ వారం షూటింగ్ చేసి మరి ఆమెను తీసేశారట. కెరియర్ లో ప్రతి ఒక్కరు ఎదురుదెబ్బలు తినడం కామనే మొదట్లోనే తనకు అలాంటి షాకులు తగిలాయని అన్నది రకుల్ ప్రీత్ సింగ్.


ఈమధ్యనే జరిగిన ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తనని ప్రభాస్, నాగ చైతన్య ఇద్దరు రిజక్ట్ చేశారని అన్నది. దశరథ్ డైరక్షన్ లో ప్రభాస్, కాజల్, తాప్సీ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కాజల్ పాత్ర కోసం ముందు రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారట. కెరటం సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన రకుల్ అప్పటికి సినిమా అంటే కేవలం హాలీడేస్ లో చేసే ఓ యాక్టివిటీ అని అనుకుందట.


తన మొదటి కన్నడ సినిమాతో వచ్చిన రెమ్యునరేషన్ తో కార్ కొన్నదట అమ్మడు. ఇక తనకు మిస్టర్ పర్ఫెక్ట్ టీం కు సెట్ అవ్వకపోవడంతో బయటకు రావాల్సి వచ్చిందని అన్నది. ఇక ఇదే సీన్ నాగ చైతన్య హీరోగా చేసిన ఆటోనగర్ సూర్యకు జరిగిందట. సమంత కోసం రాసిన ఆ పాత్రకు ముందు రకుల్ ను ఎంపిక చేశారట. ఫైనల్ గా మళ్లీ సామ్ డేట్స్ ఇవ్వడంతో రకుల్ ను పక్కన పెట్టారట.


అలా రెండు సందర్భాల్లో షాక్ కు గురైన రకుల్ ఇక ప్రొఫెషనల్ గా సినిమాలు తీయడం మొదలు పెట్టిన దగ్గర నుండి అంతా కలిసి వచ్చిందని అంటుంది. ఎన్ని భాషల్లో చేసినా సరే తెలుగు పరిశ్రమ అంటేనే తనకు ఇష్టమని చెబుతుంది రకుల్. తను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అది తెలుగు పరిశ్రమ చలువే అంటుంది. మొత్తానికి రెండు సార్లు దెబ్బతినా ఫైనల్ గా అమ్మడు ఇక్కడ స్టార్ హీరోయిన్ గా అవతరించిందన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: