ఈ నెల 11 వ తేదీన ఒకే రోజు లాంగ్ వీకెండ్ కోసం అన్నట్టుగా మూడు సినిమాలు విడుదల కి సిద్దం అయ్యాయి. నేనే రాజు నేనే మంత్రి, జయ జానకీ నాయక , లై ఇలా మూడు సినిమాలూ థియేటర్ లో అడుగు పెట్టాయి.


వరసగా సెలవలు రావడం తో థియేటర్ లకి ఓపెనింగ్ లూ, వీకెండ్ కలక్షన్ లూ బాగానే కనపడ్డాయి.అయితే వసూళ్ళ లెక్కలు సరిగ్గా చూసుకుంటే ఈ మూడు సినిమాల్లో నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఎక్కువగా జనాలని ఆకట్టుకుంది అంటున్నారు.


ట్రేడ్ పండితులు చెబుతున్న లెక్కల ప్రకారం మూడు సినిమాల్లో రానా చిత్రం 19 కోట్లు వసూలు చేసిందట. రానా లుక్ దగ్గర నుంచీ అతని స్టైల్, ఆహార్యం , టీజర్ ఇలా అన్ని విషయాల్లో తేజ తీసుకున్న కేర్ ఓపెనింగ్ లకి ఫెచ్చింగ్ అయ్యింది.


రానా తనదైన స్టీల్ లో చెప్పిన డైలాగ్ లు ట్రైలర్ తోనే ఆసక్తిని పెంచాయి, తీరా థియేటర్ కి వచ్చాక రొటీన్ కి భిన్నంగా ఉన్న కథ అవ్వడం తో తేజ స్టోరీ లైన్ జనాలకి బాగా నచ్చేసింది. ఇక రెండవ స్థానంలో బోయపాటి 'జయ జానకి నాయక' నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ కావడం ఈ సినిమాకి కలిసొచ్చింది. ఇప్పటి వరకూ ఈ సినిమా పదిహేను కోట్లు రాబట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: