తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన నాగార్జున భక్తిరస చిత్రాల్లో కూడా ఎన్నో అద్భుతాలు సృస్టించారు. శివ చిత్రంలో తన సహనటిగా అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారికి కలిగిన సంతానం అక్కినేని అఖిల్.
చిన్నతనంలోనే ‘సిసింద్రి’ చిత్రంతో ఎంట్రి ఇచ్చిన అఖిల్ తర్వాత ‘మనం’ చిత్రంలో క్లయిమాక్స్ లో కనిపించాడు. మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఈ చిత్రంలో మనోడికి పర్ఫామెన్స్, డ్యాన్స్, ఫైట్స్ కి మంచి మార్కులే పడ్డాయి కానీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అఖిల్ తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ద్వితీయ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘హలో’ చిత్రంలో నటిస్తున్నాడు అఖిల్.
ఈ చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది మళియాళ కుట్టి కళ్యాణి. తాజాగా ఈ అమ్మడిపై అప్పుడే సోషల్ మీడియాలో రూమర్లు పుట్టుకొస్తున్నాయి. మోహన్లాల్ కొడుకుతో కళ్యాణి ఎఫైర్ వుందని కోలీవుడ్, మాలీవుడ్ మీడియా ఓ రేంజ్లో రచ్చ చేస్తోంది.
ఇటీవల ప్రణవ్- కళ్యాణి కలిసున్న పిక్స్ సోషల్ మీడియాలో హంగామా చేయడమే దీనికి కారణమట. దీనిపై స్పందించిన కళ్యాణి..ఇది చాలా దారుణం అని, తమ కుటుంబంతో మోహన్లాల్ ఫ్యామిలీతో ఎప్పటి నుండో రిలేషన్ వుందని, ప్రణవ్ తనకు పెద్దన్నలాంటి వాడని ప్రణవ్ చాలా సింపుల్గా వుంటాడని, అతను తనకి రోల్ మోడల్ అంటోంది కళ్యాణి. ఇంతకీ కళ్యాణీ ఎవరో కాదు ప్రముఖ దర్శకులు ప్రియదర్శన్ ముద్దుల కూతురు.