మైకేల్ జాక్సన్ చనిపోయాక ఆమె వారసత్వాన్ని నిలబెట్టేవారు ఎవరున్నారా అనే టైమ్లో... ఆమె కూతురు పారిస్ జాక్సన్ నేనున్నానంటూ ముం దుకొచ్చింది. మైకేల్ బతికి ఉండగానే పారిస్ తనదైన శైలిలో అభిమానులను కూడగట్టుకునే ప్రయత్నం చేసింది.ఆ విషయంలో కొంత వరకు సక్సెస్ అయింది. కాని ఆతరువాత కాలంలో పాప్ ప్రియులను తనవైపుకు తిప్పుకోవడంతో విఫలమైంది.దీంతో నిత్యం ఏదో ఒక రకంగా తనని తాను తాను హైలెట్ చేసుకోవడం కోసం రకరకాల వేషాలేస్తు వస్తోంది.
తాజాగా అమ్మడు స్పిర్చువల్ టాటూస్ తో కలకలం స్రుష్టించింది.ఎవ్వరూ ఊహించని విధంగా తన బాడీపై గతంలో ఎవరూ వేయించుకోని యునీక్ శరీర భాగాల్లో టాటూస్ వేయించుకుంది. అవి కూడా ఆధ్యాత్మిక పచ్చబొట్లు కావడం విశేషం. హిందువులకు ఎంతో పవిత్రమైన ఓంకార నాదాన్ని అమ్మడు తన చాతిమధ్యలో నిలువుగా వేయించుకుంది.
అలాగే మరికొన్ని ఆథ్యాత్మిక చిహ్నాలను టాటూస్ గా శరీరంలో రకరకాలుగా వేయించుకుని నెటిజన్లను తనవైపుకు తిప్పుకుంది. చివరకు కాళ్లను కూడా వదిలిపెట్టకుండా తన పైత్యాన్ని ప్రదర్శించింది. ఆథ్యాత్మిక చింతనలో భాగంగా బుద్దుని విగ్రహం ప్రక్కనే నిల్చుని శాంతి వచనాలు వల్లె వేస్తున్నట్లు... టాప్ లె స్ గా దర్శనమిచ్చి...ఏదో చెప్పాలనుకుని ఇంకా ఏదో చూపించబోయింది.
దీనిపై సాంప్రదాయ వాదులు విరుచుకు పడుతున్నారు.అయినా ఎక్కడా తగ్గడం లేదు. ఈమాత్రం చేయకపోతే ఎలా అన్నట్లుగా రెచ్చిపోతూ పోజులిస్తోంది. ఇంతకీ పారిస్ జాక్సన్ వేయించుకున్న టూటాస్ ను మీరు చూశారా. చూడకపోతే ఇప్పుడు చూసేయండి.