‘అత్తారింటికి దారేది’ సినిమా ఆగస్టు 14న తెరపైకి రానుందట, ఇప్పుడు ఇదే టాక్ టాలీవుడ్ అంతటా నడుస్థోంది.  రాంచరణ్ సినిమా ‘ఎవడు’ కోసం చిరంజీవి స్వయంగా తమ్మునికి ఫోన్ చేసి వాయిదా వేసుకోవాలి అంటే కూడా ససేమిరా అని ఆగస్టు 7 న విడుదల చేయడానికే సిద్దమయిన పవణ్ కళ్యాణ్ సినిమా ‘ అత్తారింటికి దారేది’ ఇంకా ఆలస్యం ఎలా అవుతుంది అనుకుంటే దానికీ కారణాలు అనేకం ఉన్నాయంటున్నారు సినీవర్గాలు.

దానికంటే వారం రోజుల ముందుగా రాంచరణ్ ‘ఎవడు’ సినిమా భారీ అంచనాల మద్య విడుదలవుతోంది. ఈసినిమాతోనే రాష్ట్రంలో అత్యదిక థియేటర్లు బుక్ అవుతాయి. ఒక వేళ రిలీజ్ చేసినా ‘ఎవడు’ తో షేర్ చేసుకోవడం తప్ప ఏ థియేటర్ లోను ఫుల్ షోష్ ఉండవు. ఒక వేల ‘ఎవడు’ బంపర్ హిట్టయిందనుకో అది కూడా కష్టమే.

అంతే కాదు తమిళంలో విజయ్ కుమార్ నటించిన ‘తలైవా’ చిత్రం అదే వారంలో రిలీజ్ అవుతోంది, అంటే తమిళనాట కూడా అత్తారింటికి దారి కనిపించడం కష్టమేనన్న మాట. బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ నటించిన ‘చెన్నయ్ ఎక్స్ ప్రెస్’ సినిమా కూడా అప్పడే విడుదలవుతోంది. అంటే ఓవర్సీస్, కర్ణాటకల్లో కూడా అత్తారింటికి దారి కనిపించడం కష్టమే, అందుకే ఆగస్టు ఏడో తేదీకి బదులు ఆగస్ట్ 14 వ తేదిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను రిలీజ్ చేయాలని చూస్థున్నారట, కాదుకాదు అదే కన్ఫ్ ఫాం అని కూడా అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: