తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో చారిత్రాత్మక చిత్రాలు వచ్చాయి..కానీ ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిపై బయోస్కోపిక్ చిత్రాలు మాత్రం రాలేదు.  మొట్టమొదటి సారిగా ఎవడే సుబ్రమాణ్మం ఫేమ్ నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అలనాటి మహానటి సావిత్రి జీవితం పై ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రంలో ఆమె జీవితంలో తనతో నటించిన నటులు ఒక్కొక్కరూ ఒక్కో పాత్రలో కనిపించబోతున్నారు. 
Related image
ఇప్పటికే మళియాళ హీరో దుల్కన్ సల్మాన్, సమంత, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని, మాళవిక నాయర్ , ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్న విషయం తెలసిందే.  అయతే సావిత్రి పాత్రలో మళియాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తున్నారు.  ఇప్పటికే వీటికి సంబంధించిన  లుక్ కూడా విడుదల అయ్యాయి.  తాజాగా విలక్షణ నటులు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అలనాటి మహానటులు విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు పాత్రలో కనిపించబోతున్నారు. 
Image result for mahanati movies stills
డైలాగ్ డెలవరీలో ఆయనకు ఆయనే సాటి..ఈ నేపథ్యంలో అలాంటి పాత్రలో నటించి మెప్పించగల సత్తా ఒక్క మోహన్ బాబు కు మాత్రమే ఉండటంతో ఈ పాత్రకు ఆయనను తీసుకున్నట్లు సమాచారం.  తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పాలకొల్లులో జరుగుతోంది. త్వరలోనే సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయనున్నారు.
Image result for mahanati movies stills
అక్టోబర్‌ చివరిలో లేదా నవంబర్‌ మొదటివారం నుంచి ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నారు. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. మోహన్‌ బాబు స్క్రీన్‌ ప్రెజన్స్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుందని ఈ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెలిపాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: