సూపర్ స్టార్ మహేష్ తొలిసారి తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించిన ద్విభాషా చిత్రం ‘స్పైడర్’. దాదాపు గ‌త యేడాది కాలంగా ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డైన ఏఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సినిమా ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే అంద‌రిలోను ఉంది.

spyder movie కోసం చిత్ర ఫలితం

మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే అత్య‌ధికంగా రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి దిగేందుకు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోను ఉంది. తాజాగా స్పైడ‌ర్ ఫ‌స్టాఫ్‌, సెకండాఫ్‌లు ఎలా ఉండ‌బోతున్నాయో లైన్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. 


ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్న ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య ( ఈ సినిమాలో మెయిన్ విల‌న్‌) స్పైడ‌ర్ స్టోరీ లైన్ చెప్పేశారు. స్పైడ‌ర్‌ ఫస్టాఫ్ చాలా నవలాత్మకంగా ఉంటుంది. అలాగే సెకండాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకుల కోసమే అన్నట్టు ఉంటాయ‌ని... ఓవ‌రాల్‌గా థ్రిల్లింగా సాగే యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ ఈ సినిమా అని సూర్య చెప్పారు.

spyder movie కోసం చిత్ర ఫలితం

ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ స్పైడ‌ర్‌ను స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది. కమర్షియల్ అంశాలతో పాటు తానెప్పుడూ మిస్ కాకుండా చూసుకునే ఎమోషన్ ను కూడా ఇందులో బాగానే ఎలివేట్ చేశారని అనిపిస్తోంది. ఈ నెల 27న థియేట‌ర్ల‌లోకి దిగుతోన్న ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, మ‌రో త‌మిళ న‌టుడు భ‌ర‌త్ కూడా సూర్య‌తో పాటు విల‌న్‌గా న‌టిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: