రామ్ గోపాల్ వర్మ స్పీడుకు ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. గతంలో వర్మ చాలసినిమా    ప్రాజెక్టులు అనౌన్స్ చేసి ఆతరువాత అటక ఎక్కించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  ముఖ్యంగా  బయోపిక్స్ విషయంలో ఆవేశంతో వర్మ ఒక ప్రకటన చేయడం ఆ తర్వాత మౌన ముద్రలోకి వెళ్ళిపోవడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది.  

వర్మ తీస్తానని ప్రకటించి ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన మూవీ ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలోజయలలిత శశికళ జీవితాలపై సినిమాలు కూడ ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇలాంటి లిస్టులో  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కూడ చేరిపోతుందని అందరు అనుకున్నారు. 

అయితే వర్మ ఈసారి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  విషయంలో తన వ్యూహం మార్చాడు కథ పాతికేళ్ల కిందటిదే అయినా కదిలిస్తే అది ఎప్పుడైనా నిప్పులు రాజేయగల సమర్ధత ఈకధకు ఉండటంతో ఈ కథ ద్వారా భారీ సాహసం చేసి కోట్లు వసూల్ చేసుకోవడానికి వర్మ మాస్టర్ స్కెచ్ లు వేస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ ను తీస్తూ లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాతి పరిణామాలను హైలెట్ చేస్తానని ప్రకటించిన వర్మ తన మాట పై నిలబడుతు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలచేసాడు. 

దీనితో సినిమా కాన్సెప్ట్ ఏమిటనేది ఒక్క లుక్ తో అర్థం అయ్యేలా వర్మ వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నాడు. ఎన్టీర్ చివరి రోజులలో జరిగిన పరిణామాలలో ఆయనను ముఖ్య మంత్రి పదవి నుండి తప్పించిన వెన్నుపోటు సంఘటన సంవత్సరాలు అయినా సంచలనమే. 

ఆ విషయానికిసంబంధించి వాస్తవాలు చెపుతాను అని వర్మ చెపుతున్న మాటల వల్ల మళ్ళీ లక్ష్మి పార్వతి సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా మారింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాను జేడీ చక్రవర్తి నిర్మిస్తున్నాడని వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమని వర్మ ప్రకటన ఇచ్చిన నేపధ్యంలో ఈ సినిమా నిర్మాతగా ఎవరు ఉంటారు అన్న విషయమై రకరకాల పేర్లు ప్రచారంలోకి  వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: