ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై హృదయాంజలి ప్రోగ్రామ్ తో జనాల్లోకి దూసుకు వెళ్తూ..వారితో చేసిన అల్లరితో యాంకర్ ఉదయభాను కి విపరీతమైన పాపులారిటీ వచ్చింది.  తర్వాత కొన్ని చానల్స్ లో యాంకర్ గా చేస్తూ..ఆడియో వేడుకల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉన్న సమయంలోనే సినిమా చాన్సులు కూడా కొట్టేసింది.  లీడర్ చిత్రంలో ‘రాజశేఖరా..నీపై మోజు తీరలేదురా’ అన్న పాటకు ఉదయభాను కి చాలా పేరు వచ్చింది. యాంకర్ గా మంచి ఫామ్ లో ఉండగా తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకొని వెండితెర, బుల్లి తెరకు దూరం అయ్యింది. 
Image result for రేణు దేశాయ్ బుల్లితెర
ఆ మద్య తన కవల పిల్లతో తళుక్కున మెరిసింది ఉదయభాను.  ఇప్పుడు బుల్లితెరపై ఉదయభాను సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.  'నీతోనే డాన్స్‌' రేణు దేశాయ్‌ ఈషోకి జడ్జ్‌ గా వ్యవహరించబోతోంది మరో జడ్జిగా జానీ మాస్టర్‌ కూడ వ్యవహరించబోతున్నాడు.  ఈ కార్యక్రమానికి ఉదయభాను యాంకరింగ్ చేస్తున్నారు.  గతంలో పలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కి ఉదయభాను యాంకర్ గా చేసిన అనుభవం ఉంది. 
Image result for renu desai neetone dance udayababu
దీంతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పవన్‌కళ్యాణ్ చేస్తున్న మూవీలోని ఓ సాంగ్‌లో నటించేందుకు బుల్లితెర యాంకర్ ఉదయభాను ఓకే చెప్పిందని టాక్.  ఇప్పటికే ఉదయభానుతో త్రివిక్రమ్ చర్చలు పూర్తికావడంతో త్వరలో ఈ సాంగ్ షూట్ జరగనుందని సమాచారం.

గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి చిత్రంలో టైటిల్ సాంగ్ లో నటించింది.  రానా-లీడర్‌లోనూ సాంగ్ చేసిన సంగతి తెల్సిందే.  మొత్తానికి ఉదయభాను సెకండ్ ఇన్నింగ్స్ బాగానే కలిసి వస్తుందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: