తమిళ ఇండస్ట్రీలో వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే వ్యక్తి నటుడు, దర్శకుడు టి. రాజేందర్. తెలుగులో ‘ప్రేమసాగరం’ చిత్రంతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాలు తీసిన టి.రాజేందర్ తనయుడు యంగ్ హీరో శింబు. తాజాగా టి రాజేందర్ మీడియా సాక్షిగా హీరోయిన్ పై శివాలెత్తిపోయారు.
వివరాల్లోకి వెళ్తే... ‘విళితిరు’ సినిమాలో ధన్షిక హీరోయిన్ గా నటించింది. చిత్ర నిర్మాతలు తాజాగా ఈ సినిమా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ ధన్షిక అందరి గురించి ప్రస్తావించిన మాట్లాడి..టి.రాజేందర్ గురించి మాత్రం మర్చిపోయింది. దీన్ని అవమానంగా భావించిన ఆయన వేదికపైనే ఆమెను దుమ్ముదుళిపారు.
రజినీకాంత్ తో కబాలి సినిమాలో నటించినంత మాత్రాన స్టార్ హీరోయిన్లు అయిపోరని, పెద్దలను గౌరవించాలని హితవు పలికారు. పెద్ద ఆర్టిస్టులను గౌరవించడం నేర్చుకోకపోతే భవిష్యత్ ఉండదని హెచ్చరించారు.
వెంటనే తన తప్పు తెలుసుకున్న దన్షిక తను చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ, స్టేజ్ పై ప్రసంగించడం తనకు అలవాటు లేదని చెప్పడమే కాకుండా కాళ్లు పట్టినంత పనిచేసింది. కానీ ఆయన పట్టించుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్సెట్ అయిన ధన్షిక కన్నీటిపర్యంతమైంది.