తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుంది..ఇప్పటికే సీనియర్ నటులు, రచయిత, నిర్మాత ఎంవీఎస్ హరనాథరావు మరణవార్త ఇండస్ట్రీలో బాధపెడుతుంటే...ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి మల్లిక అనారోగ్యంతో మృతి చెందారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ బెంగుళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
సోమవారం ఉదయం ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో 10.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. యాంకర్గా కెరీర్ని ప్రారంభించి.. ఆ తర్వాత సీరియల్స్, ఆపై వెండితెరపై తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది నటి మల్లిక. డిగ్రీ చేస్తున్న సమయంలోనే తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు మల్లిక. తర్వాత సినిమాల్లో కూడా చాన్స్ రావడంతో కొంత కాలం గ్యాప్ తీసుకొని మళ్లీ బుల్లితెరపై యంకర్,సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు.
మల్లిక బుల్లితెర, వెండి తెర కెరీర్ పరంగా మంచి మార్కులే కొట్టేశారు. మె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. బుల్లితెర తొలి తరం టీవీ యాంకర్ గా మల్లిక ప్రజాభిమానం చూరగొన్నారు. ఆమె అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరగనున్నాయి.