బాహుబలి స్థాయిలో తెరకెక్కిస్తూ అనేక సినిమాలు బాలీవుడ్ లో తయారౌతున్నాయి. రాజ్పుత్ మహారాణి రాని పద్మినిగా మనం పిలుచుకునే పద్మావతి కథతో విలక్షణ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పద్మావతి` సినిమా ట్రైలర్ నిన్న అంగరంగ వైభవంగా విడుదలైన సంగతి పాఠకులకు తెలిసిందే.
ఇప్పటికే పద్మావతిగా దీపికా పదుకునే, ఆమె భర్త రావల్ రతన్ సింగ్గా షాహిద్ కపూర్, అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్వీర్ సింగ్ల ఫస్ట్లుక్లు విడుదలై సినిమాపై భారీ అంచనా లను పెంచేశాయి. సోమవారం ఈ సినిమా ట్రైలర్ అంగరంగ వైభవంగా విడుదలైంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్లో "రెండు కోట్ల పద్నాలుగు లక్షల మంది" కి పైగా వీక్షించారు.
కేవలం యూట్యూబ్లోనే మూడు లక్షల తొంబై ఐదు వేల లైక్లు వచ్చాయి. ‘బాహుబలి-2’ లాగే ఈ స్థాయిలో రికార్డు సృష్టించిన చిత్రం "పద్మావతి" కావడం విశేషం. సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని రూ.300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు.
ఇందులో దీపిక టైటిల్ పాత్రలో, రణ్వీర్ సింగ్ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జి పాత్రలో, షాహిద్ కపూర్ మహా రావల్ రతన్ సింగ్ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గానూ నిర్మాత, దర్శకుడు సంజయ్ భన్సాలీ, షాహిద్కి, రణ్వీర్కి రూ.10 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ దీపిక మాత్రం వారి కంటే ఎక్కువగా రూ.13 కోట్ల పారితోషికం అందుకుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.