తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నాగార్జున. ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యపాత్రలతో ఆకట్టుకుంటున్న నాగార్జున లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న ‘రాజుగారి గది 2’ నేడు రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రీమియమ్ షోలు పడిపోయాయి. బుల్లితెర యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి ‘రాజుగారి గది’ మూవీతో తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో మలయాళ చిత్రం ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన ‘రాజుగారి గది 2’ మూవీని పీవీపీ సంస్థ నిర్మిస్తుంది.

సెన్సార్ బోర్డ్ ఓ కాషన్‌తో యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. 12సంవత్సరాల లోపు పిల్లలు.. తల్లిదండ్రుల సమక్షంలోనే ఈ సినిమా చూడాలని సెన్సార్ బోర్డ్ పేర్కొన్న విషయం తెలిసిందే.  ఈ మద్య చాలా సినిమాలు కామెడీ,హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల నాగచైతన్యతో వివాహంతో అక్కినేని కోడలుగా మారిన సమంత మామ నాగార్జునతో కలిసి నటిస్తుండటంతో ఈ మూవీ కోసం అక్కినేని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ప్రీమియం షో చూసిన వారి ఈ సినిమా ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్, షకలక శంకర్ పై వచ్చే కామెడీ చాలా బాగుందని అంటున్నారు.  ఇంట్రవెల్ కి ముందు నాగార్జున మెంటలిస్టు గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా సీరియస్ జోన్ లోకి వెళ్తుందట.  ఇంట్రవెల్ తర్వాత సమంత పగతీర్చుకునే దెయ్యంగా కనిపిస్తుందట.
‘రాజు గారి గది 2’ మూవీలో సమంత, నాగార్జున
ముఖ్యంగా సమంత నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని.. సెకండాఫ్‌లో ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా ఉంటాయని తెలుస్తోంది.  ఇక హైటెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కించిన ఈ మూవీలో గ్రాఫిక్స్ బాగా వచ్చాయని, థమన్ మ్యూజిక్ సినిమాకు బలాన్నిచ్చేదిగా ఉందంటున్నారు.  మొత్తానికి ప్రీమియం షో టాక్ ప్రకారం హర్రర్, కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈమూవీపై పాజిటివ్ టాక్ వస్తుంది.  కాగా ఈ సినిమా హిట్ కావడం మాకు ఎంతో అవసరం అని ఎందుకంటే సమంత మా కోడలుగా అడుగు పెట్టింది..దాంతో పాటే హిట్ తీసుకు వచ్చిందని కామెంట్స్ ఆడియన్స్ నుంచి వినిపించాలని నాగార్జున నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: