తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా అంటే ఇప్పటికీ..ఎప్పటికీ గుర్తు ఉండిపోయే చిత్రం అని అందరికీ తెలుసు.  ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడీ మరి నటించింది లేడీ అమితాబ్ గా పిలుచుకునే విజయశాంతి.  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అంటే అభిమానులకు తెగ ఇష్టపడే వారు. ఈ ఇద్దరు హీరో, హీరోయిన్ గా కలిసి చేసిన ఆఖరి చిత్రం మెకానిక్ అల్లుడు. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా కీలక పాత్ర పోషించారు.
Image result for chiranjeevi vijaya shanthi
తర్వాత చిరు, విజయశాంతి జంట ఏ సినిమాలోనూ కనిపించే అవకాశం దక్కలేదు.  పది సంవత్సరాల క్రితం ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లడం..మళ్లీ సినిమాలో నటించే అవకాశం రాలేదు.  కాకపోతే చిరంజీవి మాత్రం తన 150 వ చిత్రం వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ లో నటించారు.  విజయశాంతి ఆ మద్య సినిమాల్లోకి వస్తుందని వార్తలు వచ్చాయి..కానీ ఇప్పటి వరకు అది జరగలేదు.
Related image
తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతుంది. పాతికేళ్ల తర్వాత చిరు, విజయశాంతిని సైరా నరసింహారెడ్డి సినిమాలో చూసే అవకాశాలు ఉన్నాయి.   ఈ చిత్రంలో కీలకమైన పాత్రకు విజయశాంతిని సంప్రదించాడట దర్శకుడు సురేందర్ రెడ్డి.ఈ మేరకు చిరునే స్వయంగా ఫోన్ చేసి మరీ అపాయింట్మెంట్ ఇప్పించాడని టాక్. 

Related image

ఇది ఎంత వరకు నిజమో..అబద్దమో తెలియదు కానీ...ఒకవేళ ఈ జంట మరోసారి తెరపై చూస్తే సంతోషించే అభిమానులు ఎంతో మంది ఉన్నారు.   నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోయే సైరా రిలీజ్ 2019 సంక్రాంతికి ప్లాన్ చేశారు. 

Image result for chiranjeevi vijaya shanthi




మరింత సమాచారం తెలుసుకోండి: