తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా అంటే ఇప్పటికీ..ఎప్పటికీ గుర్తు ఉండిపోయే చిత్రం అని అందరికీ తెలుసు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడీ మరి నటించింది లేడీ అమితాబ్ గా పిలుచుకునే విజయశాంతి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అంటే అభిమానులకు తెగ ఇష్టపడే వారు. ఈ ఇద్దరు హీరో, హీరోయిన్ గా కలిసి చేసిన ఆఖరి చిత్రం మెకానిక్ అల్లుడు. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా కీలక పాత్ర పోషించారు.
తర్వాత చిరు, విజయశాంతి జంట ఏ సినిమాలోనూ కనిపించే అవకాశం దక్కలేదు. పది సంవత్సరాల క్రితం ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లడం..మళ్లీ సినిమాలో నటించే అవకాశం రాలేదు. కాకపోతే చిరంజీవి మాత్రం తన 150 వ చిత్రం వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ లో నటించారు. విజయశాంతి ఆ మద్య సినిమాల్లోకి వస్తుందని వార్తలు వచ్చాయి..కానీ ఇప్పటి వరకు అది జరగలేదు.
తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతుంది. పాతికేళ్ల తర్వాత చిరు, విజయశాంతిని సైరా నరసింహారెడ్డి సినిమాలో చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీలకమైన పాత్రకు విజయశాంతిని సంప్రదించాడట దర్శకుడు సురేందర్ రెడ్డి.ఈ మేరకు చిరునే స్వయంగా ఫోన్ చేసి మరీ అపాయింట్మెంట్ ఇప్పించాడని టాక్.
ఇది ఎంత వరకు నిజమో..అబద్దమో తెలియదు కానీ...ఒకవేళ ఈ జంట మరోసారి తెరపై చూస్తే సంతోషించే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోయే సైరా రిలీజ్ 2019 సంక్రాంతికి ప్లాన్ చేశారు.