తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శక, నిర్మాత గుణ శేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు.  అగ్ర హీరోలకు మంచి లైఫ్ ఇచ్చిన గుణ శేఖర్ అంటే భారీ బడ్జెట్ తో కూడుకున్న చిత్రాలే అయి ఉంటాయి.  రుద్రమదేవి సినిమాతో భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించిన గుణ శేఖర్ మరో చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారట.
Related image
పూర్ణ ఇతిహాసాలలో అత్యంత పేరు గలిగిన ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే సినిమాను తెరకెక్కించనున్నట్టుగా గుణశేఖర్‌ ఇటీవల ప్రకటించాడు.  అంతేకాదు యంగ్‌ హీరో రానా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి.  ఇది 'భక్త్ర ప్రహ్లాద' కథే అయినా .. హిరణ్యకశిపుడి కోణంలో కొనసాగుతుంది. అందువల్లనే గుణశేఖర్ ఈ సినిమాకి 'హిరణ్యకశిప' అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు.
Image result for rana
ఈ సినిమాకి 100 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని గుణశేఖర్ చెబుతున్నారట. అయితే మార్కెట్‌ పరంగా గుణశేఖర్‌గాని, రానా గాని ఇద్దరు ఇంతవరకు వంద కోట్లమార్క్‌ను అందుకోలేదు. అందుకే అంత బడ్జెట్‌తో హిరణ్యకశ్యపను తెరకెక్కించటం సాహసమే అని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ భారీ ప్రయోగంలో గుణ మరోసారి విజయం సాధింస్తాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: