తెలుగు ఇండస్ట్రీలోయి ‘చిత్రం’ తో దర్శకుడిగా పరిచయం అయిన తేజ తర్వాత ‘జయం’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో అప్పట్లో తేజా బిజీ దర్శకుడిగా మారిపోయాడు. కానీ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ పెద్దగా ఆకర్షించలేదు. దీంతో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఈ సంవత్సరం రానా హీరోగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రానికి తేజ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇదే కాక వెంకటేశ్ కథానాయకుడిగా మరో సినిమా తెరకెక్కించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు .. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుంది. అయితే వెంకటేష్ సరసన అనుష్క ను అనుకున్నారట..కానీ వెంకటేశ్ సరసన నాయికగా కాజల్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం.
దీనికి కారణం తేజ సెంటిమెంట్ అని అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలోకి 'లక్ష్మీ కల్యాణం' సినిమాతోనే తెలుగు తెరకు కాజల్ పరిచయమైన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో తనకి ఫస్టు ఛాన్స్ ఇచ్చాడనే కృతజ్ఞతతోనే కాజల్ 'నేనే రాజు నేనే మంత్రి' లో చేయడానికి అంగీకరించింది. ఆ సినిమా హిట్ కావడం తేజతో పాటు ఆమెకి కూడా కలిసొచ్చింది.
ఇండస్ట్రీలో దర్శకుడు తేజకి కాజల్ మంచి సెంట్ మెంట్ అయ్యింది. ఆ సెంటిమెంట్ కారణంగానే వెంకటేశ్ జోడీగా కాజల్ నే తేజ తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. వెంకటేశ్ తో కాజల్ నటించడం ఇదే మొదటిసారి. వెంకటేశ్ పుట్టినరోజైన డిసెంబర్ 13న ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.