ఒకవైపు నంది అవార్డులపై రగడ మరొకవైపు కత్తి మహేష్ హైపర్ ఆదిల మధ్య జరుగుతున్న మాటలయుద్దం మధ్య ఛానల్స్ ఆవార్తలతో తెగ హడావిడి చేస్తున్నాయి. లేటెస్ట్ గా మరొకసారి కత్తి మహేష్ పవన్ అభిమానులను టార్గెట్ చేస్తూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. ఈరోజు విడుదల అవుతున్న ‘లండన్ బాబులు’ ప్రీమియర్ షోకు కత్తి మహేష్ హైపర్ ఆదిలు కూడ వచ్చారు. అయితే వారిద్దరూ స్నేహితులులా కలిసిపోయి అసలు వారిమాధ్య ఎటువంటి గొడవలు లేనట్లుగా ప్రవర్తించడమే కాకుండా మీడియా కెమెరాలకు కలిసిపోజులు ఇచ్చారు. 
రివ్యూలో సినిమా బాగోలేదు..
ఈ ఫోతోలలోని ఒక ఫోటోను కత్తి మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘కలిస్తే మేమూ మేమూ బాగానే ఉంటాం. విభేదాలు విషయాలకు సంబంధించి పరిస్థితులకు లేదా సిద్దాంతాలు సంబంధించి ఉంటాయేగాని వ్యక్తిగత వైరాలు ఉండవు. ఆ విషయం తెలియక అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచోళ్ళు నానా రభసా చేసి వాళ్ళ జీవితాలు సంకనాకించుకుంటారు. మేలుకొండ్రా నాయనా! రేపోమాపో పవన్ కళ్యాణ్‌ని కలిసినా ఇలా నవ్వుతూ ఫోటో దిగగలను. తరువాత వెధవలు అయ్యేది మీరే’ అంటూ కామెంట్స్ పెట్టి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ పవన్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా నిజంగానే కత్తి మహేష్ హైపర్ ఆదిలు కలిసిపోయారా రేపు ఇదేపరిస్థితి పవన్ కళ్యాణ్ తో కూడ ఉంటుందా అన్నఅనుమానాలతో తలలు పట్టుకున్నారు పవన్ అభిమానులు. 
బాడీ షేమింగ్ అనేది
ఇదిజరిగిన కొద్దిగంటలు కాకుండానే హైపర్ ఆది ఒకప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. కత్తి మహేష్‌కు పొట్ట ఉందని బట్టతల ఉంది అని నేను అనుకోవడం లేదు. కత్తి మహేష్ క్యూట్ బాయ్. సుత్తి రాజేష్ అనేవాడు మాఊర్లో ఉండే స్నేహితుడిని ఉద్దేశించి తాను ఆకామెంట్స్ చేసానని అంటూ తన ఫ్రెండ్ కు పెసరట్టు దోసెలు ఆఖరికి ఉప్మా చేయడం కూడరాదు అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. 
Image may contain: 4 people, people smiling, people standing
కత్తి మహేష్ మాదిరిగానే తన ఫ్రెండ్ సుత్తి రాజేష్ కూడ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ ఉంటాడు అంటూ అన్యాపదేశంగా తనకు కత్తి మహేష్ కు ఎటువంటి రాజీ కుదరలేదు అన్న సంకేతాలు ఇచ్చాడు. దీనితో వీరిద్దరి మాటల యుద్ధంలో పవన్ కళ్యాణ్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధంకాక పవన్ అభిమానులు మరింత అసహనానికి లోనవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: