ఎల్.ఎల్.బి పూర్తి చేసి ఊరిలో పంచాయితీ గొడవలను సమర్ధవంతంగా పరిష్కరిస్తున్న సప్తగిరి హైదరాబాద్ వెళ్లి అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంటారు. పెద్ద లాయర్ కావాలన్న ఉద్దేశంతో మూసి ఉన్న కేసు సప్తగిరిని ఆకర్షితుడిని చేస్తుంది. దాన్ని తిరగతోడే ప్రయత్నం చేస్తాడు. ఓ బడా బాబుని కాపాడే క్రమంలో రాజ్ పాల్ (సాయి కుమార్) కేసు అతనికి ఫేవర్ గా కొట్టించేస్తాడు. అయితే మళ్లీ తిరగతోడటంతో సప్తగిరి అనుకోని సమస్యల్లో పడతాడు. ఎవరైతే తనని నమ్ముతారో వాళ్లకే సప్తగిరి ద్రోహిగా కనిపించేలా ప్లాన్ చేస్తారు. ఇంతకీ సప్తగిరి ఈ ఇబ్బందులను ఎలా అధిగమించాడు. రాజ్ పాల్ మీద ఆ కేస్ ఎలా గెలిచాడు అన్నది అసలు కథ.
సప్తగిరి ఎక్స్ ప్రెస్ కు ఎల్.ఎల్.బికి సప్తగిరి నటనలో పరిణితి వచ్చింది. హీరోగా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నంలో కామెడీతో పాటుగా మాస్, ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ కు అంత ప్రాధ్యాన్యత ఉన్నట్టు అనిపించదు. సినిమాలో సాయి కుమార్ కూడా ప్రధాన పాత్ర చేశాడు. సప్తగిరికి పోటీగా ఆయన పాత్ర సాగుతుంది. ఇక హరి ప్రసాద్ కూడా తన సహజ నటనతో మెప్పించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.
జాలీ ఎల్.ఎల్.బి కథను దర్శకుడు చరణ్ తెలుగులో ఓ కమర్షియల్ సినిమాకు తగినట్టుగా బాగా డీల్ చేశాడు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు వినడానికి మాములుగా ఉన్నాయి. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.