టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నందమూరి హీరో బాలకృష్ణ. ఈ సంవత్సరం గౌతమి పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘జై సింహ’ చిత్రంలో నటింస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత వెంటనే ఎన్టీఆర్ బయోపిక్ లో నటించాల్సి ఉన్నా..కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకులు తేజ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
గతంలో తెలుగు ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ లో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన ఎస్వీ కృష్ణా రెడ్డి కొంత కాలంగా ఫెల్యూర్స్ చవిచూశారు.
తాజాగా ఎస్వీ కృష్ణా రెడ్డి తో ఓ సినిమాలో కమిట్ అయ్యారు నందమూరి బాలకృష్ణ. ఫాంటసీ నేపథ్యంలో సాగే ఒక కథను ఎస్వీ కృష్ణారెడ్డి వినిపించడంతో, బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ అంతరిక్ష యాత్రికుడిగా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. గతంలో 'యమలీల' వంటి ఫాంటసీతో కృష్ణారెడ్డి .. 'ఆదిత్య 369'తో బాలకృష్ణ విజయాలను అందుకున్నారు.
మరో సారి అలాంటి సినిమా రిపీట్ అవ్వబోతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇండస్ట్రీలో బాలకృష్ణ ఇప్పటి వరకు సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో ఫాంటసీ మూవీ తెరకెక్కనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందని చెప్పుకుంటున్నారు.