ఈ మద్య టాలీవుడ్ ఇండస్ట్రీ వచ్చే పెద్ద హీరోల సినిమాలు విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ను సాధిస్తున్నాయి. ఇక్కడ హిట్ అయిన సినిమాలు విదేశాలలో కూడా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతున్నాయి. టాలీవుడ్ హీరోలకి అక్కడ కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మన హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలయ్య లతో పాటు రీసెంట్ గా వస్తున్న నాని, శర్వానంద్ లకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్ రీసెంట్ గా జవాన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ నిమిత్తం మస్కట్ వెళ్లారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్కి మస్కట్లో లభించిన ఆదరణ అతనిని షాక్లో పడేసింది. సాయిధరమ్ సరసన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇందులో కథానాయికగా నటిస్తుంది.
రెండు యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ ఒమన్ దేశానికి పయనమయ్యారు . మస్కట్ సిటీ విమానాశ్రయంలో దిగగానే తేజూకి చిరు అభిమానుల నుండి సాదర స్వాగతం లభించింది. మెగా మేనల్లుడు వస్తున్నాడని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ పెద్ద దండలతో ఎదురొచ్చి , వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.
దాంతో మెగా ఫ్యాన్స్ అభిమానానికి తేజూ ఎంతో సంతోషించినట్లు తెలుస్తుంది. గతంలో ఈ చిత్రానికి ఇంటిలిజెంట్, దుర్గ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని వార్తలు రాగా, తాజాగా ధర్మా బాయ్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ టైటిల్ని బట్టి చూస్తుంటే ఇదొక పక్కా మాస్, యాక్షన్ మూవీ అని అర్ధమవుతుంది.