ఈ సంవత్సరం నందమూరి హీరో నట సింహం బాలకృష్ణ మంచి జోష్ లో ఉన్నాడు.  ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో బాలయ్య వందవ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ మంచి విజయం సాధించింది.  ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ తో వచ్చారు. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ న‌టిస్తోన్న ‘జై సింహా’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ షర వేగంగా జరుగుతుంది.  ఇప్పటికే ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న తరుణంలో జై సింహా టీజ‌ర్‌ను ఆ సినిమా బృందం రిలీజ్ చేసింది.   బాల‌య్య చేస్తోన్న ఫైట్స్‌ అదుర్స్ అనిపిస్తున్నాయి. బాలయ్య మాస్‌లుక్‌తో పాటు స్టైలిష్ లుక్‌తోనూ క‌న‌ప‌డుతున్నారు. 'సింహం మౌనాన్ని స‌న్యాసం అనుకోవ‌ద్దు.. సైలెంటుగా ఉంద‌ని కెలికితే త‌ల కొరికేస్త‌దీ..' అంటూ బాల‌య్య డైలాగు కొట్టారు.

నయనతార, హరిప్రియ, నఠాషా దోషి కథానాయికలుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందగా, సమరసింహా రెడ్డి స్టైల్ లో చిత్రం ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు . 

టీజర్ చూసిన తర్వాత అభిమానులలో సినిమాపై భారీ హైప్స్ పెరుగుతున్నాయి.  ఇక ఆడియో వేడుకలో ట్రైలర్ రిలీజ్ చేసి క్రిస్మస్ కి మాంచి గిఫ్ట్ ఇయ్యాలని టీం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సీకే ఎంటర్టైన్మెంట్ బేనర్పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న జై సింహా చిత్రం తప్పక ప్రేక్షకులని అలరిస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: