గతేడాది 'నాయకి' అనే కామెడీ హారర్ ఫిల్మ్ లో కనిపించిన హీరోయిన్ త్రిష త్వరలో 'మోహిని'గా ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తోంది. సీరియస్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ప్రజంట్ నెట్ లో సందడి చేస్తుంది.
త్రిష ఈ మధ్య కమర్షియల్ సినిమాలకు కామ పెట్టి కథానాయికా ప్రాధాన్యమున్న సినిమాల పై ఫోకస్ పెంచింది. అందుకే మొన్న ‘నాయకి’ అంటు భయపెట్టిన తాను ఇప్పుడు ‘మోహిని’గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో త్రిష ఎప్పుడూ చూడని అవతారంలో కన్పించి అందరికి షాక్ ఇచ్చింది.నీలం రంగు దుస్తుల్లో, తలపై కిరీటం, చేతుల్లో ఆయుధాలతో కన్పిస్తున్న త్రిష గెటప్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
తాజాగా విడుదలైన ‘మోహిని' ట్రైలర్ ప్రేక్షకులను భయపెడుతోంది. గ్రాఫిక్స్ హై క్వాలిటీతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ సినిమాను థియేటర్లలో చూస్తే భయంతో వణికి పోవడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఈ సినిమాలో వివిధ షేడ్స్ ఉన్న పాత్రల్లో తన నట విశ్వరూపాన్ని చూపించబతోంది త్రిష. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ లండన్ లో జరిగింది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్లే నెక్ట్ ఇయర్ రిలీజ్ అవ్వనుంది. మామూలుగా హారర్ సినిమాలకు పెట్టే బడ్జెట్ కంటే ఈచిత్రానికి కాస్త ఎక్కువే పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది.
ఎలా చూసిన నటిగా త్రిషకు మంచి పేరుంది. అయితే కథనంలో దర్శకుడు ఎలాంటి మ్యాజిక్ చేశాడు అన్నదే సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే.. త్రిషకు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ . మోహిని గా త్రిష అదుర్స్ అనిపించి సినిమాను సక్సెస్ రూట్ లో నిలిపితే.. నయనతార మాదిరిగా గ్లామర్ టు ట్యాలెంట్ కు చేరిన హీరోయిన్ గా పేరు సంపాదించుకుంటుంది.ఏ మాత్రం రివర్స్ అయిన ఉన్న సినిమాలు మినహా.. మళ్లీ కొత్తకొత్త ఆఫర్స్ రావడం కష్టమే.