టాలీవుడ్ లో దాదాపు పది సంవత్సరాలు విరామం తీసుకున్న తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు..మెగాస్టార్ చిరంజీవి. అయితే చిరంజీవి రీ ఎంట్రీ పై ఎన్నో అపోహలు నెలకొన్న తరుణంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో చిరంజీవి తన స్టామినా ఎంలో చూపించాడు. దాంతో అప్పటి వరకు చిరు పై ఉన్న అపోహలన్నీ పటాపంచలయ్యాయి...బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
మెగా స్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ మరోసారి అభిమానుల ముందుకు రాబోతున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథని చిరు తన 151 చిత్రం కోసం ఎంచుకొన్న సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డి’ ఇప్పటికే షూటింగ్ మొదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్చరణ్ నిర్మిస్తున్నారు.
ఇక చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' మొదటి షెడ్యూల్ పూర్తైంది. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. "అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో సైరా మొదటి షెడ్యూల్ పూర్తైందని ఆయన అన్నారు. అద్భుతాన్ని సృష్టించేందుకు 'సైరా' టీం చాలా కష్టపడుతుందని" ఈ సందర్భంగా వెల్లడించారు.
హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టోనీ చింగ్ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ స్టంట్స్.. చాలా స్టయిలిష్ గా, బాగా వచ్చాయంటున్నాడు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నయనతార ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఆమె కాల్షీట్లు చూసి నెక్ట్స్ షెడ్యూల్ ఫిక్స్ చేయాలని యూనిట్ భావిస్తోందని అన్నారు. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా 'సైరా నరసింహారెడ్డి' సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని రత్నవేలు అన్నారు.