అజ్ఞాతవాసి’ ఆడియోకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలలో ఏఒక్క పాట కూడ మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాటలు లేకపోవడంతో ప్రస్తుతం త్రివిక్రమ్ దృష్టి అంతా ఈనెల 31 రాత్రి విడుదలకాబోతున్న పవన్ ‘కొడుకా కోటేశ్వరావు’ పాట పై ఉంది. పవన్ అభిమానులకు న్యూఇయర్ గిఫ్ట్ గా విడుదలకాబోతున్న ఈపాట ‘అజ్ఞాతవాసి’ ఆల్బమ్ అంతా ఒక ఎత్తు అయితే  ఈపాట మరొక ఎత్తుగా ఉండాలని ఈపాటను జనం మధ్యకు తీసుకు వెళ్ళడానికి త్రివిక్రమ్ అనేక ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ముఖ్యంగా ‘అజ్ఞాతవాసి’ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలి అంటే బిసి సెంటర్లలో ఈమూవీ కలక్షన్స్ దుమ్ము దులపాలి కాబట్టి మన ఇరు రాష్ట్రాలలోని బిసి సెంటర్లలో ఈపాటను మైకులు ద్వారా మోత మోగాలి అనే స్కెచ్ త్రివిక్రమ్ వద్ద ఉన్నట్లు టాక్. వాస్తవానికి ఈపాట చిత్రీకరణ ఎప్పుడో పూర్తి అయిపోయింది అని తెలుస్తోంది.

 

ఈపాటను చాలారోజుల క్రితమే రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. అయితే అప్పట్లో మరో గాయకుడు చేత ఈపాటను పాడించారు. ఇప్పుడు అదే పాటను మరింత క్రేజ్ తీసుకు రావడానికి పవన్ చేత పాడించినట్లు తెలుస్తోంది. భాస్కర భట్ల వ్రాసిన ఈపాట పక్కా మాస్ గా ఉంటుందని సమాచారం.

 

ఇది ఇలా ఉండగా ‘అజ్ఞాతవాసి’ కోసం మరో ఫంక్షన్ చేయాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ పాట రిలీజ్ అయిన కొన్ని రోజులకే విశాఖపట్నంలో కానీ విజయవాడలో కాని ‘అజ్ఞాతవాసి’ కి సంబంధించిన మరో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేస్తే అది ఈసినిమా భారీ ఓపెనింగ్స్ కు అన్ని విధాల సహకరిస్తుంది అన్న ఆలోచనలలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫంక్షన్స్ విషయంలో పెద్దగా ఆసక్తికనపరచని పవన్ కళ్యాణ్ ను ఒప్పించడమే ప్రస్తుతం త్రివిక్రమ్ కు ఉన్న సమస్య. ఏది ఏమైనా ‘అజ్ఞాతవాసి’ ని బిసి సెంటర్లలోని మాస్ ప్రేక్షకులకు దగ్గరకు చేర్చడానికి త్రివిక్రమ్ చాల పాట్లు పడుతున్నాడనుకోవాలి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: