టాలీవుడ్ కలెక్షన్ కింగ్ సీనియర్ నటుడు అయినా మంచు మోహన్ బాబు. ప్రస్తుతం గాయత్రి అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక సంచలనకరమైన విషయం బయటకు వచ్చింది.. అదేమిటంటే ‘గాయత్రి’ సినిమా లో మోహన్ బాబు  గారు రెండు రోల్స్ చెయబోతున్నారు..అందులో ఒక రోల్ హీరో కాగా ఇంకొకటి విలన్ రోల్  కావడం విశేషం. అయితే మోహన్ బాబు తన గత చిత్రాలలో ద్విపాత్రాభినయం చేసిన ‘పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి, అడవిలో అన్న, ఎం. ధర్మరాజు ఎం.ఏ’ వంటి ఘన విజయాలు సాధించగా ఆయన ‘ఎం. ధర్మరాజు ఎం.ఏ’ తరవాత ఆయన విలన్ గా నటిస్తున్న చిత్రం ఈ ‘గాయత్రి’.

ఈ గాయత్రీ చిత్రం మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఫిబ్రవరి మాసంలో తొమ్మిదవ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందులో మంచి విష్ణు, శ్రియ శరన్, అనసూయలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జగపతి బాబు , ప్రియమణి ల సినిమాని డైరెక్ట్ చేసిన మదన్ ఇప్పుడు ఈ సినిమా తో మళ్ళీ తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలి అనే తహతహ లో ఉన్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ విషయం లో హీరో మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది అనీ ప్రతీ సన్నివేసం విషయం లో మోహన్ బాబు తనని విసిగిస్తున్నాడు అనేది ఈ డైరెక్టర్ కంప్లయింట్ అట .. ఒకానొక టైం లో షూటింగ్ కూడా ఆపేద్దాం అనేంత విసుగు ఈ డైరెక్టర్ కి వచ్చింది అనీ దానికి కారణం మోహన్ బాబు ప్రతీ చిన్న విషయం లో వేలు దూర్చడమే అంటున్నారు ఫిలిం నగర్ జనాలు.

అందుకే షూటింగ్ కూడా కొన్నాలు పోస్ట్ పోన్ అయ్యింది అనేది సమాచారం. హీరోగా, విలన్ గా కూడా చేస్తున్న మోహన్ బాబు కి తన సినిమా బాగారావాలి అనే తపన మరొక పక్క డైరెక్టర్ కెమో స్వేచ్చ కావాలి అనే ఫీలింగ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: