నేచురల్ స్టార్ నానీ నిర్మాతగా మారాడు.. వాల్ పోస్టర్ బ్యానర్ పై నానీ సమర్పణలో అ పేరుతో ఒక మూవీ రూపొందనుంది.. ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకుడు.. ఈ దర్శకుడు చెప్పిన కథ నానీకి నచ్చడంతో అతడికే దర్శకుడిగా తొలి అవకాశం ఇస్తూ, తానే నిర్మాతగా మారాడు నానీ. ఈ మూవీకి ప్రశాంతి త్రిపురనేని నిర్మాత.ఈ మూవీ సెకండ్ లుక్ ను నానీ విడుదల చేశాడు.
ఈ పోస్టర్ లో అందమైన నవ్వు ముఖంతో ఉన్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేస్తూ..ఒక్కొ క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజినా, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి వంటి వారు నటిస్తున్న ఈ చిత్రానికి రవితేజ, నాని వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.
ఇప్పటికే అవసరాల శ్రీనివాస్ , ఇషా, రెజీనా ఫస్ట్ లుక్ లు రిలీజ్ అయ్యాయి. ఇక నాని ఫస్ట్ లుక్ మాత్రం చాలా వెరైటీగా ఓ ఎల్లో ఫిష్ ని రిలీజ్ చేశారు. తాజాగా తాజాగా ఈ సినిమాలోని మురళీశర్మ లుక్ని విడుదల చేశారు. మెజీషియన్గా ఈ చిత్రంలో ఆయన పాత్ర ఉంటుందనేది ఈ లుక్ చూస్తే అర్ధమవుతోంది. ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా పండించగల నైపుణ్యం మురళీశర్మ సొంతం.
ఈ సినిమాలో ఆయన పాత్ర ఆకట్టుకుంటుందనేది ఈ లుక్తో అర్ధమవుతోంది. సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందో ఇంకా తెలియదు కానీ.. ఇలా విడుదలవుతున్న పోస్టర్స్ని చూస్తుంటే మాత్రం సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆత్రుత మాత్రం ప్రేక్షకుల్లో కలుగుతోంది.