తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. హీరోగా మంచి ఫామ్ లో ఉండగా ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ‘ ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించిన కొంత కాలానికే కాంగ్రెస్ లో విలీనం చేసి అక్కడ కేంద్రమంత్రిగా పదవీబాధ్యతలు కొనసాగించారు. ఏమిది సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న ఆయన రీసెంట్ గా వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక చిరు రీ ఎంట్రీ పై ఎన్నో అపోహలు వచ్చాయి..కానీ థియేటర్లో ఈ సినిమా చేసిన హంగామాకు అందరూ ఫిదా అయ్యారు. సోషల్ మెసేజ్ తో పాటు ఫుల్ ఎంట్రటైన్ మెంట్ తో చిరు ఈజ్ బ్యాక్ అన్నారు. ప్రస్తుతం చిరంజీవి కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో 'సైరా' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగునాట తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
ఈనెల 6న ప్రారంభమైన మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. దాదాపు 20 రోజులు కష్టపడి తొలి షెడ్యూల్ షూటింగ్ను పూర్తిచేశారు. తర్వాత షెడ్యూల్ లో హీరోయిన్ నయనతార నటించనుంది. ఇక రెండవ షెడ్యూల్ లో నయనతార కాంబినేషన్లోని సీన్స్ వున్నాయట. కానీ ఇంతవరకూ ఆమె తన డేట్స్ ను ఖరారు చేయడం లేదట.
దీంతో టెన్షల్లో పడ్డ దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమెతో సంప్రదించారట..కానీ నయన్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సందిగ్ధంలో పడ్డారట చిత్ర యూనిట్. నయనతార ఇలా ఎటూ తేల్చకుండా ఆలస్యం చేస్తుండటంతో, చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినా సమస్య లేకుండగా ఉండటం కోసం మరో హీరోయిన్ ను సంప్రదిస్తున్నారట.