‘అజ్ఞాతవాసి’ విడుదలకు ఇంకా కేవలం నాలుగురోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఈసినిమా ప్రమోషన్ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రస్తుతం తలలు పండిన టాలీవుడ్ విశ్లేషకులకు కూడ అర్ధం కావడం లేదు అని అంటున్నారు. దీనికి కారణం ఈసినిమా రిలీజ్ డేట్ దూసుకు వస్తున్నా ఈసినిమాకు సంబంధించిన ధియేట్రికల్ ట్రైలర్ ఇప్పటి వరకు విడుదల కాలేదు. అసలు ఈమూవీ విడుదల లోపున మరో ట్రైలర్ ఉంటుందో లేదో అనే విషయం పై ‘అజ్ఞాతవాసి’ యూనిట్ వర్గాలు కూడ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయి అని అంటున్నారు.

 

దీనికితోడు ‘అజ్ఞాతవాసి’ నిర్మాతలు ఈమూవీకి సంబంధించిన రిలీజింగ్ డేట్ పోస్టర్లు కూడ సోషల్ మీడియాలో విడుదల చేయకపోవడంతో ‘అజ్ఞాతవాసి’ ఏమైంది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈసినిమా విడుదలకు ఇక కేవలం నాలుగురోజులే గ్యాప్ ఉన్న నేపధ్యంలో ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఇంకా ఛానల్స్ లో కనిపించకపోవడం ఏమిటి అంటూ పవన్ అభిమానులు గందరగోళంలో ఉన్నారు.

 PAVAN AGYATHA VASI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అయితే పవన్ కు తన సినిమాల ప్రమోషన్ విషయం పై పెద్దగ ఆసక్తి లేని నేపధ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ కూడ అదే బాటలో పయనిస్తూ తమ సినిమా ఫైనల్ ప్రోడక్ట్ మాత్రమే అసలు విజయాన్ని తెచ్చిపెడుతుంది అన్న ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ ఉన్నాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈసినిమా నిర్మాతలు ఆఖరి నిముషంలో ఏసమస్య వస్తుందో అన్న ఉద్దేశ్యంతో హారిక హాసిని నిర్మాణ సంస్థ తరపున కోర్టులలో కేవియట్ అప్లికేషన్స్ వేశారు అన్న వార్తలు వస్తున్నాయి.

 PAVAN AGYATHA VASI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనితో ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటున్నారు అన్న అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి. వాస్తవానికి తెలుస్తున్న సమాచారం మేరకు టి-సిరీస్ సంస్థ నుండి ‘అజ్ఞాతవాసికి’ ఎటువంటి సమస్యలేదని కేవలం స్క్రిప్ట్ చూపించండి అని మాత్రమే వారు అడిగారని అంటూ కొందరి మాటలు. అయితే మరోప్రక్క ఇలా కోర్టు ద్వారా ఇంకోప్రక్క ఫిలిం ఛాంబర్ ద్వారా ‘అజ్ఞాతవాసి’ దర్శక నిర్మాతలు అనుసరిస్తున్న వ్యూహాలు ప్రస్తుతానికి గందరగోళంగా మారాయి. మరి ఈరోజుకైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి..

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: