టాలీవుడ్ లో ఈ మద్య నందమూరి బాలకృష్ణ మంచి జోష్ మీదే ఉన్నారు. గత సంవత్సరం సంక్రాంతి బరిలో తన వందవ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’తో అద్భుతమైన విజయం అందుకున్నారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్ ’సినిమాతో దుమ్మురేపారు. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ, నయనతార జంటగా నటిస్తున్న ‘జై సింహ’ ఈ సంవ్సరం సంక్రాంతి బరిలో దిగుతుంది.
జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన మరో నటి నటాషా దోషీ, హరిప్రియలు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ దుమ్మురేపుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే..బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారట..ఈ సినిమా నిడివి 2 గంటల 43 నిమిషాలు అని సమాచారం. అంటే ఇంటర్వెల్ తో కలుపుకుంటే ఇది 3 గంటల సినిమా. నిడివి ఎక్కువైనా బోర్ కొట్టేలా ఉండదనీ .. అప్పుడే అయిపోయిందా అనేలా ఉంటుందని ఈ సినిమా టీమ్ చెబుతోంది.
ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే బాలకృష్ణ-ప్రకాశ్ రాజ్ కాంబినేషన్ వచ్చే సన్నివేశాలు చాలా అద్బుతంగా ఉంటాయట. ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు బీభత్సమై రివేంజ్ స్టోరీ ఉందట. ఉత్కంఠభరితులను చేసే ఈ సీన్స్, సినిమాను ఎక్కడికో తీసుకువెళతాయని చెబుతున్నారు. ప్రకాశ్ రాజ్ కూతురు పాత్రలో నయనతార కనిపిస్తుందనీ, ఈ సినిమా హైలైట్స్ లో ఆమె పాత్ర ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.