పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ అజ్ఞాతవాసి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయితే పవన్ త్రివిక్రం ఫ్యాన్స్ మాత్రం సినిమా ఆహా ఓహో అనేస్తున్నా అసలు మ్యాటర్ అంత పట్టులేదని ఒరిజినల్ టాక్. ఈ సినిమా కథ కాపీ అంటూ వచ్చిన వార్తలను కూడా ఛేధించి రిలీజ్ చేశారు.


తీరా చూస్తే ఏదైతే వార్తల్లో ఉందో లార్గో వించ్ సినిమా మూల కథతోనే ఈ సినిమా తీశారు. ఇక ఇందులో త్రివిక్రం మార్క్ మ్యాజిక్ మిస్ అయ్యింది అన్నది అందరు అంటున్న మాట. ఇక ఈ సినిమాలో సైకిల్ ఎపిసోడ్ మరి దారుణంగా ఉంది. రావు రమేష్, మురళి శర్మలను ఆటపట్టిస్తూ ఏదైతే ఆ ఎపిసోడ్ ఉందో అది ప్రేక్షకులకు విసుగు వచ్చేలా చేసింది. ఫస్ట్ హాఫ్ కూడా మరి ఫ్లాట్ గా చేశారు. 


సందర్భాన్ని బట్టి తన మాటలతో మనసుకి గుచ్చుకునేలా చేసే త్రివిక్రం మొదటిసారి ఇలా కూడా ఆయన సినిమాలు చేస్తాడా అన్న ఆలోచన వచ్చేలా చేశారు. సినిమా కథ అతనే రాసుకున్నా కాపీ అంటూ వార్తలు వచ్చాయి కాబట్టి ముందు ఓ నోట్ అన్నా వేయాల్సి ఉంది. అది కూడా చేయకుండా మరి నెగ్లెక్ట్ చేశారు. ఇక సినిమాలో కొడకా కోటేశ్వర రావు పాట కూడా అంత కిక్ అనిపించలేదు.


భారీ రేంజ్ లో రిలీజ్ అయ్యి మొదటి రెండు రోజుల పరిస్థితి బాగున్నా పోటీలో మిగతా సినిమాలు రిలీజ్ వస్తేనే అసలు సత్తా ఏంటన్నది తెలుస్తుంది. బాలకృష్ణ జై సిం హా, సూర్య గ్యాంగ్, రాజ్ తరుణ్ రంగులరాట్నం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతి హంగామా చేసే సినిమాలు వస్తున్నా ఫైనల్ గా ఎవరు ఏ రేంజ్ లో సత్తా చాటుతారు అన్నది వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: