మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో ఉన్న సంబందం అందరికి తెలిసిందే. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా నుండి త్రివిక్రం సినిమా అంటే నిర్మాత రాధాకృష్ణ అని ఫిక్స్ అయ్యారు. జులాయి సినిమాకు కో ప్రొడ్యూసర్ గా ఉన్న రాధాకృష్ణ సన్నాఫ్ సత్యమూర్తి నుండి నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాడు. 


ఆ తర్వాత అఆ సినిమా కూడా హిట్ అవడంతో ఈ కాంబినేషన్ పై అందరి గురి ఏర్పడింది. త్రివిక్రం సున్నితమైన కథ.. మనసుకి తాకే మాటలు.. స్టార్ హీరో నుండి అభిమానులు కోరుకునే ఎనర్జీ.. ఇవన్ని ఉంటాయి కాబట్టి సినిమా పక్కా హిట్. అయితే ఇదే అంచనాల మీద వచ్చిన పవర్ స్టార్ అజ్ఞాతవాసి మాత్రం లెక్క తప్పింది. 


పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాల రికార్డులన్ని తిరగరాస్తుంది అనుకున్న అజ్ఞాతవాసి కాస్త బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డది. ఇక సినిమా నిర్మాతగా రాధాకృష్ణకు ఈ సినిమా పెద్ద షాకే ఇచ్చిందని అంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ 125 కోట్ల పైగా చేసిన ఈ సినిమా కలక్షన్స్ లో మాత్రం నిరాసపడ్డాడు. 


ఫైనల్ గా ఈ సినిమా కలక్షన్స్ నిర్మాతకు షాక్ ఇచ్చాయి. ఇప్పటిదాకా వారంలో 55 కోట్ల కలక్షన్స్ మాత్రమే వసూళు చేసిన అజ్ఞాతవాసి ఈ సినిమా అటు నిర్మాతకు ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కు షాక్ ఇచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ నటించారని తెలుస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: